గెలిచిన ఆనందంలో ప్రీతి జింతా బాంగ్రా డ్యాన్స్

ఐపీఎల్ అంటేనే ఉత్కంఠత.. ఆఖరి క్షణంలో మలుపు తిరిగిపోయే మ్యాచ్‌లు ఎన్నో ఉంటాయి. ఫలితం తేలేవరకే అంచనాలన్నీ..

గెలిచిన ఆనందంలో ప్రీతి జింతా బాంగ్రా డ్యాన్స్

ఐపీఎల్ అంటేనే ఉత్కంఠత.. ఆఖరి క్షణంలో మలుపు తిరిగిపోయే మ్యాచ్‌లు ఎన్నో ఉంటాయి. ఫలితం తేలేవరకే అంచనాలన్నీ..

ఐపీఎల్ అంటేనే ఉత్కంఠత.. ఆఖరి క్షణంలో మలుపు తిరిగిపోయే మ్యాచ్‌లు ఎన్నో ఉంటాయి. ఫలితం తేలేవరకే అంచనాలన్నీ.. ఊహలన్నీ అరచేతిలో దాపెట్టుకుని అభిమాన జట్టు గెలిచిందని తెలియగానే ఉద్వేగంతో ఏం చేస్తున్నామో కూడా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ సంతోషాన్ని తెలియపరుస్తుంటారు. 
Read Also : క్రీడామంత్రిపై క్రీడాకారిణిని పోటీకి దించిన కాంగ్రెస్

పంజాబ్‌లోని మొహాలి వేదికగా జరిగిన పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది. ఈ ఆనందంలో జట్టు సహ యజమాని ప్రీతి జింతా ప్లేయర్లకు హగ్ ఇస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచింది. మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన శామ్ కరన్ వైపుకు వస్తూనే అతనితో కాలు కదిపి బాంగ్రా డ్యాన్స్ వేసి అలరించింది. 

వారిద్దరూ డ్యాన్స్ వేస్తుంటే.. డేవిడ్ మిల్లర్.. మన్‌దీప్ సింగ్‌లు కూడా వారితో పాటు కాలు కదిపారు. పంజాబ్ సంప్రదాయ నృత్యమైన బాంగ్రా డ్యాన్స్ వేయడంతో స్థానికంగా అభిమానులు తెగ మెచ్చేసుకుంటున్నారు. 

శామ్ కరన్ కెరీర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో లీగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టి 52 పరుగులు ఇచ్చాడు. సీజన్‌లో అత్యధికంగా కొనుగోలు ప్లేయర్లలో మనశీ పాండ్యా ఒకడు. 
Read Also : ఓటు కంటే టూరే : పోలింగ్ పై లాంగ్ వీకెండ్ ప్రభావం