ఇకపై ఏపీలో ఇలా చేయడం నేరం, జైలుకి పంపిస్తారు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.

  • Published By: veegamteam ,Published On : April 12, 2020 / 10:38 AM IST
ఇకపై ఏపీలో ఇలా చేయడం నేరం, జైలుకి పంపిస్తారు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం. ఉమ్మివేయడం, పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై బ్యాన్ విధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేరంగా పరిగణిస్తారు. ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీచేశారు. అంటే జైలుకి పంపిస్తారన్న మాట.

ఆదివారం(ఏప్రిల్ 12,2020) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో కరోనా వైరస్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపణీ చేయాలని, ప్రతి ఒక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. వీటి వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని తెలిపారు. కరోనా హైరిస్క్‌ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

రాష్ట్రంలో వృద్ధులు, మధుమేహం, బీపీ వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు తరలించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు జగన్. కరోనా వైరస్ కేసులు ఏపీలో భారీగా పెరుగుతున్నాయి. శనివారం సాయంత్రానికి ఏపీలో 405 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 11 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నేరంగా ప్రకటించారు. తెలంగాణలో సైతం రోడ్లపై ఉమ్మి వేస్తే కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఏపీలోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని జగన్ ప్రభుత్వం ప్రకటించింది.