అంచనాలకు మించి ఏపీ బడ్జెట్‌ ప్రతిపాదనలు : ఆందోళనలో ఆర్థికశాఖ

ఏపీ బడ్జెట్‌ రూపకల్పన ఆర్థికశాఖను టెన్షన్‌ పెడుతోంది. అంచనాలకు మించి బడ్జెట్‌ ప్రతిపాదనలు మూడు లక్షల కోట్లు దాటడంతో అధికారులు నివ్వెరపోతున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 01:38 AM IST
అంచనాలకు మించి ఏపీ బడ్జెట్‌ ప్రతిపాదనలు : ఆందోళనలో ఆర్థికశాఖ

ఏపీ బడ్జెట్‌ రూపకల్పన ఆర్థికశాఖను టెన్షన్‌ పెడుతోంది. అంచనాలకు మించి బడ్జెట్‌ ప్రతిపాదనలు మూడు లక్షల కోట్లు దాటడంతో అధికారులు నివ్వెరపోతున్నారు.

ఏపీ బడ్జెట్‌ రూపకల్పన ఆర్థికశాఖను టెన్షన్‌ పెడుతోంది. అంచనాలకు మించి బడ్జెట్‌ ప్రతిపాదనలు మూడు లక్షల కోట్లు దాటడంతో అధికారులు నివ్వెరపోతున్నారు. ఎవరికెన్ని కేటాయించాలో.. ఎవరికి కోత పెట్టాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ఈ సారి ఏపీ బడ్జెట్ అంచనాల్ని మించిపోతోంది. మార్చి ఆరో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ రేయింబవళ్లు కసరత్తు చేస్తోంది. అయితే అంచనాలకు మించిన ప్రతిపాదనలు రావడంతో ఆర్థిక శాఖ ఆందోళనలో పడింది. 

3.5 లక్షల కోట్ల మేర బడ్జెట్ 
వివిధ శాఖల అవసరాలను బట్టి 2.5 లక్షల కోట్ల మేర బడ్జెట్ రూపొందిస్తే సరిపోతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. కానీ అంచనాలకు మించిన ప్రతిపాదనలు 3.5 లక్షల కోట్ల మేర రావడంతో ఎలా సర్దుబాటు చేయాలనో అర్థంకాని పరిస్థితులో ఆర్ధికశాఖ ఉంది. వార్షిక అవసరాల కోసం ప్రభుత్వ శాఖలు భారీ డిమాండ్లు పెడుతున్నాయి. ఖరారు చేసే బడ్జెట్ దాదాపు 2.5 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆయా శాఖల నుంచి 3.5 లక్షల కోట్లకుపైగా ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. అవసరాలు, ఖర్చులు తగ్గించుకోవాలని పదేపదే చెపుతున్నా ఆయాశాఖల నుంచి వస్తోన్న డిమాండ్లు భారీగా ఉండటంతో ఆర్థికశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

బడ్జెట్‌పై ఆర్థికశాఖ సమీక్షలు 
బడ్జెట్‌పై వివిధ శాఖల అధికారులతో గత నెల ఆర్థికశాఖ సమీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయా శాఖ నుంచి ఆన్‌లైన్‌లో బడ్జెట్ ప్రతిపాదనలు తెప్పించుకొంది. ఈనెల 3వ తేదీనుంచి రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. అవసరాలకు మించి వచ్చిన ప్రతిపాదనలపైనే ఈ సమావేశాల్లో చర్చించారు. గత బడ్జెట్ సమావేశాల్లో కసరత్తు సమయంలో ఇదే పరిస్థతి ఎదురయింది. శాఖల నుంచి డిమాండ్లు ఎంత భారీగా వచ్చాయంటే… భారీగా నిధుల కేటాయింపులోనూ కోత విధించారు. ఆ నిధులనూ పలు శాఖలు ఖర్చు చేయలేకపోయాయి. ఇచ్చిన నిధుల్ని ఖర్చుచేయలేకపోవడం ఒక ఎత్తయితే.. ఇవ్వాల్సిన నిధులను ఆర్థిక పరిస్థుల కారణంగా ఇవ్వకుండా చేతులెత్తేసిన వైనం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. 

బడ్జెట్ లో నవరత్నాలు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు పెద్దపీట 
ఇదే సమయంలో గత బడ్జెట్‌లో కన్నా ఈసారి సంక్షేమానికి, నేరుగా నగదు బదిలీకి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. నవరత్నాల పేరుతో ప్రవేశపెట్టిన అనేక పథకాలకే లక్ష కోట్లు కావాల్సి వస్తుంది. దీనితో ఇతర ఖర్చుల్లో కోత తప్పదన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపాదనల్లో అత్యవసరమైన వాటికే డిమాండ్ చేయాలని ఆర్థికశాఖ పేర్కొంటోంది. భారీ బడ్జెట్ ను, శాఖల డిమాండ్లను యథాతథంగా ఆమోదిస్తే మరిన్ని… అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ముందుగా నవరత్నాలు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు పెద్దపీట వేసిన తర్వాతే ఇతర పథకాలకు నిధులు కేటాయించాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.