చేనేతకారుడి వస్త్రంలో రామయ్య ధనస్సు..’జై శ్రీ రామ్..అయోధ్య పవిత్ర థామ్’

  • Published By: nagamani ,Published On : August 2, 2020 / 05:04 PM IST
చేనేతకారుడి వస్త్రంలో రామయ్య ధనస్సు..’జై శ్రీ రామ్..అయోధ్య పవిత్ర థామ్’

అయోధ్యలో ఆగస్టు 5న శ్రీ రామమందిరం నిర్మాణ భూమి పూజ కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కోసం వారణాసిలోని బచ్చేలాల్ అనే నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని నేశారు. ఆ వస్త్రంపై ‘జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్’ అని ఎంబ్రాయిడరీ చేశారు. ఈ వస్త్రం ప్రత్యేకతను బచ్చేలాల్ వివరిస్తూ..మెటిరీయల్, డిజైన్ ఈ వస్త్రం గొప్పతనమని, దీనిపై జైశ్రీమ్, అయోధ్య పవిత్ర థామ్ అని రాసి ఉంటుందని తెలిపాడు.



శ్రీరాముడి ధనుస్సు కూడా ఈ డిజైన్ లో ఉంటుందని..కాటన్, సిల్క్ దారాలతో ఈ క్లాత్ తయారు చేశామని, ఈ వస్త్రం తయారికీ 15 రోజులు పట్టిందని బచ్చేపాల్ తెలిపారు. ఇందులో బంగారు, ఎరుపు రంగు వాడామని..వస్త్రం పొడవు 72 అంగుళాలు, వెడల్పు 22 అంగుళాలతో తయారైంది. పోలీస్ కమిషనర్ ద్వారా అయోధ్యకు ఈ వస్త్రం పంపాలని అనుకుంటున్నట్టు బచ్చేపాల్ చెప్పారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందని, ఇందువల్ల పర్యాటకంతో పాటు తమ వ్యాపారం కూడా పెరుగుతుందని బచ్చే లాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంత కాలానికి శ్రీరాముడి మందిరానికి పునాదిరాయి పడుతున్నందుకు తాను ఎంతో ఆనందిస్తున్నానని తెలిపాడు.