చౌకబారు విమర్శలు : పవన్ వారి చేతిలో పావులా మారారు 

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 06:51 AM IST
చౌకబారు విమర్శలు : పవన్ వారి చేతిలో పావులా మారారు 

టీడీపీ నేతలపై విమర్శల దాడి చేస్తుంటే వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.ఈ సారి  పవన్ కళ్యాన్ పై  తన ప్రతాపాన్ని చూపెట్టారు. కొంతమంది చేతిలో పవన్ కళ్యాణ్ పావుగా మారారని విమర్శించారు. టీడీపీ పేరును ప్రత్యేకించి ప్రస్తావించని విజయ సాయి పవన్ కళ్యాణ్  చౌకబారు ప్రచారం చేసే కొంతమంది చేతిలో పావుగా మారాడంటూ ట్వీటారు. పవన్ వారికోసం పనిచేస్తున్నారని విమర్శించారు. వైసీపీపై పవర్ విమర్శించటం సరికాదన్నారు. 

కాగా గతంలో కూడా విజయ్ సాయి..అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని విమర్శించిన పవన్.. టార్గెట్ చేయడాన్ని విజయ్ సాయి తప్పుబట్టారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజాధనం వృథా కాదన్న విజయ్ సాయి పారదర్శకతలో దేశానికి తమ ప్రభుత్వం కొత్తదారి చూపిస్తామని వ్యాఖ్యానించారు.