మా ఖర్మకాకపోతే మరేంటి? : అమరావతిని రక్షించుకోకపోతే చచ్చినట్లేనట
అమరావతిని రక్షించుకోలేకపోతే చచ్చినట్లేలెక్కట..రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. చంద్రబాబూ.. మీ బినామీల కోసం, మీ సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ప్రజలంతా సమిధలు కావాలా? వారంతా బలికావాలా? చంద్రబాబులాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రతిపాదించటం..దాని కమిటీలపై కమిటీలు వేయటం..ప్రభుత్వానికి అనుకూలంగానే కమిటీలు నివేదికలు ఇవ్వటంపై అటు ప్రతిపక్షాలు..ఇటు ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో 20రోజులకుపైగా అమరావతిలోని గ్రామాల రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వారికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. దీనిపై వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న క్రమంలో నిరంతరం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మండిపడే ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో చంద్రబాబుపై విమర్శలు కురిపించారు.
అమరావతిని రక్షించుకోలేకపోతే చనిపోయినట్టేనట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 8, 2020