పంచాయితీ ఎన్నికలపై కీలక తీర్పు నేడే!
High Court Verdit:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరక హైకోర్టు పరిధిలోకి వెళ్లిన పంచాయితీ ఎన్నికల వ్యవహారంపై ఇవాళ(21 జనవరి 2021) తీర్పు రానుంది.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ ఈ నెల 11న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) అప్పీల్ చేసింది.
ఈ విషయమై పూర్తి విచారణ అనంతరం.. వాదనలు ముగియగా, చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది. నేటి హైకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రాబోతుంది.