వైసీపీ నేత, నిర్మాత ఫిర్యాదు : బండ్ల గణేశ్పై అటెంప్ట్ మర్డర్ కేసు
సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్లగణేశ్ దాడి చేశారని,
సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్లగణేశ్ దాడి చేశారని,
సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తన ఇంటిపై బండ్లగణేశ్ దాడి చేశారని, తనను బెదిరించారని పీవీపీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు విషయంలో బండ్లగణేశ్ మోసం చేశారని ఆరోపించారు. డబ్బు ఇవ్వాలని అడిగినందుకు అనుచరులతో కలిసి తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. అటు బండ్ల గణేశ్ కూడా పీవీపీ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల విషయంలో పీవీపీ మోసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని కంప్లైంట్ లో తెలిపారు.
శుక్రవారం(అక్టోబర్ 4,2019) అర్థరాత్రి తన అనుచరులతో కలిసి వచ్చిన గణేశ్.. తనను బెదిరించాడని, దౌర్జన్యం చేశాడని పోలీసులకు పీవీపీ ఫిర్యాదు చేశారు. పీవీపీ ఫిర్యాదుతో పోలీసులు బండ్లగణేశ్ పై కేసు నమోదు చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేశారు. బండ్ల గణేశ్తో పాటు మరో నలుగురిపై సెక్షన్ 420, 448, 506 రెడ్విత్ ఐపీసీ 43 కింద కేసులు నమోదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. టెంపర్ సినిమాకి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్ చేశారు. కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని సమాచారం.