NRI Murder : అమెరికాలో ప్రవాస భారతీయుడి హత్య..రూ. 7లక్షల కోసం కాల్చి చంపిన దుండగుడు
అమెరికాలో దారుణం జరిగింది. క్యాసినో ఆడి గెలిచిన డబ్బులు కొట్టేయడానికి ప్రవాసభారతీయుడిపై ఓ దోపిడి దొంగ కాల్పులు జరిపి చంపేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన అరవపల్లి శ్రీరంగ.
Murder of Non resident indian : అమెరికాలో దారుణం జరిగింది. క్యాసినో ఆడి గెలిచిన డబ్బులు కొట్టేయడానికి ప్రవాసభారతీయుడిపై ఓ దోపిడి దొంగ కాల్పులు జరిపి చంపేశాడు. అరెక్స్ ల్యాబోరేటరీస్ ఫార్మా సంస్థ సీఈఓగా పని చేస్తున్న శ్రీరంగ దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను ఓ దారి దోపిడి దోంగ 80 కిలోమీటర్లు ఫాలో అయి ఇంటికి వెళ్లి మరీ చంపాడు.
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అరవపల్లి శ్రీరంగ న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నాడు. ఈ కంపెనీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లోనే ఉంది. తయారీ మాత్రమే న్యూజెర్సీలో ఉంది. శ్రీరంగ.. ఎజ్మైండ్స్, ఈపేరోల్ కంపెనీలకు కూడా సీఈవోగా పనిచేస్తున్నాడు. 54ఏళ్ల శ్రీరంగ న్యూయార్క్ ప్లెయిన్స్బరోలో స్థిరపడ్డారు.
Petrol, Diesel Prices : దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..అక్టోబర్ లో 24 సార్లు పెంపు
తన ఇంటికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్సెల్వేనియాకు వెళ్లిన శ్రీరంగ..పార్క్ క్యాసినో ఆడి దాదాపు 7 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఇది గమనించిన ఓ దుండుగుడు శ్రీరంగను ఫాలో అయ్యాడు. అతని కారు వెనుక అనుసరిస్తూ అతని ఇంటికి వెళ్లాడు. శ్రీరంగ ఇంట్లోకి వెళ్లగానే బ్యాక్డోర్ పగులగొట్టుకుని ఇంటి లోపలికి వెళ్లాడు. డబ్బుల కోసం శ్రీరంగతో జరిగిన ఘర్షణలో అతనిపై కాల్పులు జరిపి దుండగుడు పారిపోయాడు.
కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీరంగ ఇంటికి వచ్చిన పోలీసులు.. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్రగాయాలు కావడంతో అప్పటికే ఆయన మృతి చెందాడు. నిందితుడిని జెకై రీడ్ జాన్గా పోలీసులు గుర్తించారు. అతన్ని పెన్సెల్వేనియాలో అరెస్టు చేసి న్యూజెర్సీ పోలీసులకు అప్పగించారు.