MP : ఉజ్జయినిలో 11.71 లక్షల దీపాలు.. గిన్నిస్ రికార్డు
ఉజ్జయిని ఆలయ పట్టణంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా మంగళవారం 11.71 లక్షల మట్టి దీపాలు వెలిగించి.. కొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పింది.
11,71,078 Diyas : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయంగా పేరొందిన ఉజ్జయిని ఆలయ పట్టణంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా మంగళవారం 11.71 లక్షల మట్టి దీపాలు వెలిగించి.. కొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పింది. అయోధ్యలో గతంలో 9.41 లక్షల మట్టి దీపాలు వెలిగించిన రికార్డును అధిగమించింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం రామ్ ఘాట్, దత్ అఖారా ఘాట్ ల వదద 11,71,078 మట్టి దీపాలను వెలిగించడంతో ఆ ప్రాంతమంతా దేదేపమాన్యంగా వెలిగిపోయింది. ఈ దీపాలను వెలిగించడానికి చిన్నారుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు పాల్గొన్నారు. గిన్నిస్ బుక్ కు సంబంధించిన ఐదుగురు సభ్యుల బృందం ఉజ్జయినికి చేరుకుని దీపాలను పరిశీలించారు. అనంతరం రికార్డు సృష్టించిందని ప్రకటించారు.
Read More : Ujjain Pakistan Zindabad Slogans : ఉజ్జయినిలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు
సభ్యుల్లో ఒకరైన నిశ్చల్ బోరట్ రికార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు అందచేశారు. ప్రభువు యొక్క దయ, ప్రజల భక్తితో ఇది సాధ్యమైందన్నారు. దీపాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాయంత్రం 6.42 గంటలకు సైరన్ మ్రోగిన తర్వాత కేవలం 10 నిమిషాల్లో 13 లక్షలకు మందికి పైగా 11 లక్షల దీపాలను వెలిగించారని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారిపోయిం. బాణసంచా మెరుపులతో ఆకాశం రంగులమయంగా మారిపోయింది. మహాకాలేశ్వర ఆలయంలో 51,000, మంగళ్ నాథ్ ఆలయంలో 11 వేలు, కాలభైరవ ఆలయం, ఇతర ఘాట్ లలో 10 వేలు, గడ్కలిక ఆలయంలో 1100, సిద్ధావత్ ఆలయం, ఘాట్ లలో 6 వేలు, హర్సిద్ధి టెంపుల్ లో 5 వేల దీపాలను వెలిగించారు. ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు, ఇళ్ల వద్ద కూడా ప్రజలు దీపాలను వెలిగించారు. మొత్తం ప్రాంతాన్ని తనిఖీ చేసేందుకు డ్రోన్లను ఉపయోగించారు.
Ujjain, MP, India makes Guinness world record, lights up 11,71,078 diyas.#Mahashivratri@yudhapati88 @NogoSosroAsli @anas_satriyo pic.twitter.com/q64agSh2lU
— Aman Verma (@amanverm_a) March 2, 2022