AP Covid Cases : ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు

ఏపీకి బిగ్ రిలీఫ్. కరోనావైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు(AP Covid Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో..

AP Covid Cases : ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు

Ap Corona Cases

AP Covid Cases : ఏపీకి బిగ్ రిలీఫ్. కరోనావైరస్ వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు(AP Covid Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 13వేల 460 కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వ‌రుస‌గా రెండో రోజు కూడా రాష్ట్రంలో ఒక్క క‌రోనా మరణం కూడా లేదు. జిల్లాల వారీగా చూస్తే… పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంత‌పురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో మరో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,176 మంది కరోనా(Ap covid cases) బారిన పడగా వారిలో 23,01,904 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 1,543 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,729గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు 3,31,39,649 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్(AP covid cases) విడుదల చేసింది. క్రితం రోజు 101 కరోనా కేసులు నమోదయ్యాయి.

AP Corona: ఏపీలో భారీగా తగ్గిన కరోనా

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. మరోసారి కోవిడ్ కొత్త కేసులు 6వేలకు దిగొచ్చాయి. బుధవారం 8 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6వేల 561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్త కేసులు మూడు నెలల కనిష్ఠానికి తగ్గిపోయాయి. పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు చేరింది. కరోనా మరణాలు కూడా భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 142 మంది కోవిడ్ తో చనిపోయారు. ముందురోజు ఆ సంఖ్య 223గా ఉంది. ఇప్పటి వరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.14 లక్షల మంది మరణించారు.

నిన్న 14,947 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్నటి వరకూ రికవరీల సంఖ్య 4.23 కోట్లు దాటింది. మొత్తం కేసుల్లో 98.62 శాతం మంది మహమ్మారిని జయించారు. మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 77 వేలకు పడిపోయాయి. యాక్టివ్ కేసుల రేటు రెండు శాతం దిగువకు చేరి 0.18 శాతంగా నమోదైంది. నిన్న 21.8 లక్షల మంది టీకా తీసుకోగా..ఇప్పటివరకూ 178 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.(Ap covid cases)

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

దశల వారీగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి.. కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై పడగవిప్పుతూనే ఉంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి.. జనాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తుంది. కరోనా మొదలైన నాటి నుంచి కాలానుగుణంగా అది చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసి.. పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు.