IPL 2022: గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్గా రషీద్ ఖాన్
ఐపీఎల్ 2022లో భాగంగా జరగనున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్సో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి కీలక అనౌన్స్ మెంట్ వచ్చింది.
IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా జరగనున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్సో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కు ముందు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి కీలక అనౌన్స్ మెంట్ వచ్చింది. ఐపీఎల్ వేలం తర్వాత కొత్త ఫ్రాంచైజీగా అధికారికంగా ఖరారు చేసిన గుజరాత్ తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని గతంలోనే ప్రకటించింది. ఇక సోమవారం లక్నో జట్టుతో ఆడనున్న తొలి మ్యాచ్ కు ముందు వైస్ కెప్టెన్ గా రషీద్ ఖాన్ పేరును ప్రకటించేసింది.
ముంబై ఆల్ రౌండర్గా పేరు తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్గా బాల్ను తిప్పిన రషీద్ ల సారథ్యంలో గుజరాత్ జట్టు ముస్తాబవుతుంది. ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తూ ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో సత్తా చాటాడు రషీద్ ఖాన్. రీసెంట్గా జరిగిన ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.15కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
‘హార్దిక్ పాండ్యా చాలా నైస్ పర్సన్. మేమెప్పుడూ కలిసి ఆడలేదు. కానీ, మా ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉంది. గేమ్ గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా పాజిటివ్ గా ఉంటాడు’ అని బోరియా మజుందార్ అన్నారు.
Read Also : గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. పాండ్యా వస్తున్నాడు.. యో-యో టెస్టు పాస్..!