Lawyer Thrashes Woman : కోర్టు ఆవరణలోనే.. మహిళను వెంటాడి చితకబాదిన లాయర్
ఓ కేసులో సహనం కోల్పోయిన లాయర్ ఏకంగా కోర్టు ఆవరణలోనే మహిళను కొట్టాడు. ఆమె పారిపోతుంటే వెంటబడి మరీ చితకబాదాడు.
Lawyer Thrashes Woman : మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలోని బీయోహరి కోర్టు ఆవరణలో జరిగిన ఘటన వైరల్ గా మారింది. లాయర్ తీరు వివాదానికి దారితీసింది. జనం ఆయనపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఓ కేసులో సహనం కోల్పోయిన లాయర్ ఏకంగా కోర్టు ఆవరణలోనే మహిళను కొట్టాడు. ఆమె పారిపోతుంటే వెంటబడి మరీ చితకబాదాడు.
Livestock Inspector: అధికారులు ఆశ్చర్యపోయేలా కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టిన పశుసంవర్ధకశాఖ ఉద్యోగి
ఆమె పేరు భారతి పటేల్(28). భర్త నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. భరణం కోసం కోర్టులో పిటిషిన్ వేసింది. ఈ పిటిషన్ వాదనల సందర్భంగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భర్త తరఫు వాదిస్తున్న లాయర్ భగవాన్ సింగ్ (58) సహనం కోల్పోయాడు. కోర్టు ఆవరణలోనే ఆమెను కొట్టాడు. అతడి నుంచి తప్పించుకుని పారిపోతుంటే.. వెంటబడి మరీ చితకబాదాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Wife Suicide: భర్త సినిమాకు తీసుకెళ్లలేదని..ఆత్మహత్య చేసుకున్న భార్య
ఈ ఘటన గురువారం జరిగిందని, భర్తతో వివాదానికి సంబంధించి ఆ మహిళ కోర్టుకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లాయర్ భగవాన్ సింగ్ పై ఐపీసీ సెక్షన్లు 355(దాడి), 323(స్వచ్ఛందంగా గాయపరచడం), 294(అశ్లీల చర్యలు లేదా బహిరంగంగా మాటలు), 506(నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Shameful…
Lawyer ran and beat woman in Shahdol court premises, woman’s child kept crying on the ground@dmshahdol @unwomenindia #tajinderbagga #TeJran #JanhitMeinJaari #bangalorerains pic.twitter.com/uEWPQhrmHj— Subham Anand (@anand_subham1) May 6, 2022