Shamshabad : ఇల్లు ఖాళీ చేయించారనే కక్షతో.. వృద్ధురాలితోపాటు చిన్నారిని హత్య చేసిన వ్యక్తి

నేరుగా పార్వతమ్మ ఇంటి కంపౌండ్ వాల్ గోడ దూకి లోపలికి చొరబడిన దివాకర్.. చిన్న గేట్ ఆవరణలో నిద్రిస్తున్న పార్వతమ్మను గొంతు పట్టుకొని, ఇటుకతో తలపై మోదాడు. దీంతో వృద్ధురాలు చనిపోయారు. China

Shamshabad : ఇల్లు ఖాళీ చేయించారనే కక్షతో.. వృద్ధురాలితోపాటు చిన్నారిని హత్య చేసిన వ్యక్తి

Shamshabad

old woman – child killed : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణం జరిగింది. ఇల్లు ఖాళీ చేయించారనే కక్షతో ఓ వ్యక్తి వృద్ధురాలితో పాటు తొమ్మిదేళ్ల చిన్నారిని హత్య చేశాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. హత్యలకు కారకుడైన దివాకర్ సాహును అరెస్టు చేశారు. శనివారం నందిగామ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన వీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ ప్రాంతానికి చెందిన ఎర్రగారి పార్వతమ్మ(60) అంగన్ వాడీ ఆయాగా పని చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం భర్త, నాలుగేళ్ల క్రితం పెద్దకుమారుడు చనిపోయాడు. మరో కొడుకు ఇంటి నుంచి వెళ్లి పోవడంతో పార్వతమ్మ ఒంటరిగా నివసిస్తున్నారు. స్థానికంగా ఉన్న బందుకుంట తండాలోని అంగన్ వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మ పక్కనే ఉంటున్న తన చెల్లెలు కొడుకు కృష్ణయ్య కుమార్తె భానుప్రియ(9)ను తోడుగా పెట్టుకొని బాలిక బాగోగులు చూసుకుంటున్నారు.

Five earthquakes jolt Jammu and Kashmir: కశ్మీరులో కలకలం..24 గంటల్లో ఐదు భూకంపాలు

ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ నెలలో బీహార్ రాష్ట్రానికి చెందిన దివాకర్ సాహూ(23) తన భార్య అంజలీదేవితో కలిసి పార్వతమ్మ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండడంతో పార్వతమ్మ ఆ దంపతులను ఇటీవలే ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో పార్వతమ్మపై కక్ష పెంచుకున్న దివాకర్ సాహూ ఎలాగైనా పార్వతమ్మను చంపాలనుకున్నాడు. పార్వతమ్మ ఇంటిలో అద్దెకుంటున్న క్రమంలో ఆమెకు ఎవరూ లేరన్న విషయం గమనించడంతోపాటు వృద్ధురాలి వద్ద డబ్బు, నగలు ఉన్నట్లు గుర్తించాడు.

పథకం ప్రకారం దివాకర్ సాహూ.. పార్వతమ్మ ఇంటికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముంటూ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో 16న అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో నిద్రలేచిన దివాకర్ కాలకృత్యాలకు వెళ్తున్నట్లు భార్య అంజలికి చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. నేరుగా పార్వతమ్మ ఇంటి కంపౌండ్ వాల్ గోడ దూకి లోపలికి చొరబడిన దివాకర్.. చిన్న గేట్ ఆవరణలో నిద్రిస్తున్న పార్వతమ్మను గొంతు పట్టుకొని, ఇటుకతో తలపై మోదాడు. దీంతో వృద్ధురాలు చనిపోయారు.

China: చైనా యువత కొత్త ధోరణి..! అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకొని వెయిటర్లుగా ఎందుకు మారుతున్నారు?

ఈ అలజడితో నిద్రలేచిన చిన్నారి బతికి ఉంటే తనను గుర్తిస్తుందని భావించిన నిందితుడు కత్తితో చిన్నారి భానుప్రియ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పార్వతమ్మ వద్ద ఉన్న బీరువా తాళాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లి అల్మారాలో నుంచి 2 వరుసల బంగారు పుస్తెలతాడు, వంకు, వెండి పట్టీలు, వెయ్యి రూపాయల నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ మేరకు చిన్నారి భానుప్రియ తల్లి శశికల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఏసీసీ భాస్కర్ గౌడ్ పర్యవేక్షణలో శంషాబాద్ ఎస్ వోటీ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణగౌడ్, నందిగామ ఇన్ స్పెక్టర్ రామయ్య తమ బృందంతో రంగంలోకి దిగి ఘటనా స్థలంలో విచారణ జరిపారు.

Sudan’s Khartoum Air Strike: సుడాన్‌లో వైమానిక దాడి..ఐదుగురు పిల్లలతో సహా 17 మంది మృతి

ఈ క్రమంలో మృతురాలు పార్వతమ్మ ఇంటిలో గతంలో అద్దెకు ఉన్న దివాకర్ పై అనుమానం రావడంతో విచారణ కోసం దివాకర్ అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లగా అదే రోజు దివాకర్ ఇల్లు ఖాళీ చేసినట్లు తేలింది. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడడంతో దివాకర్ కోసం గాలించి పట్టుకుని విచారించగా నిందితుడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.