Musk vs Mark: ముదురుతున్న వివాదం.. చీటింగ్ చేస్తున్నారంటూ జూకర్బర్గ్పై ఎలాన్ మస్క్ ఫైర్
ట్విటర్ను సొంత చేసుకున్న అనంతరం.. వింత వింత నిర్ణయాలతో యూజర్లను మస్క్ గందరగోళానికి గురి చేస్తున్నారు. పెయిడ్ బ్లూటిక్, సబ్స్క్రిప్షన్, ఎడిట్ బటన్, ట్వీట్ వ్యూ లిమిట్ చేయడం వంటి నిర్ణయాలు వినియోగదారులను అయోమయానికి గురి చేశాయి.
![Musk vs Mark: ముదురుతున్న వివాదం.. చీటింగ్ చేస్తున్నారంటూ జూకర్బర్గ్పై ఎలాన్ మస్క్ ఫైర్ Musk vs Mark: ముదురుతున్న వివాదం.. చీటింగ్ చేస్తున్నారంటూ జూకర్బర్గ్పై ఎలాన్ మస్క్ ఫైర్](https://10tv.in/wp-content/uploads/2023/07/Untitled-1-36.jpg)
Twitter vs Threads: ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్పై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ఫైర్ అయ్యారు. కాంపిటీషన్ అయితే ఓకేనని అయితే చీటింగ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఒక ట్వీట్కు రిప్లైగా మస్క్ ఈ కామెంట్ చేశారు. ట్విట్టర్ తరహాలోనే థ్రెడ్స్ అనే పేరుతో జూకర్బర్గ్ కొత్త యాప్ను తీసుకువచ్చారు. అచ్చం.. ట్విటర్లాగే పని చేసే ఈ థ్రెడ్స్ యాప్.. కేవలం నాలుగు గంటల్లోనే 50 లక్షల మంది ఖాతాలు తెరుచుకున్నారు. ఇది ట్విటర్ను ఇబ్బంది పెట్టే విషయం. ఈ విషయమై మెటా సంస్థకు ట్విటర్ న్యాయవాది అలెక్స్ స్పిరో ద్వారా నోటీసులు కూడా పంపించారు.
ఇన్స్టాగ్రామ్కు అనుబంధంగా రిజిస్ట్రేషన్ ఉండడంతో బుధవారం థ్రెడ్ను ప్రారంభించగానే చూస్తుండగానే లక్షల మంది లాగిన్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్కు సుమారు 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే ట్విటర్కు కేవలం 25 కోట్ల మంది వినియోగదారులే ఉన్నారు. థ్రెడ్ యాప్ కనుక ఎక్కువ మంది వినియోగించినట్లైతే అది ట్విటర్ను ప్రభావితం చేస్తుంది. జూకర్బర్గ్ వ్యవహారం చూస్తుంటే కూడా అలాగే కనిపిస్తోంది.
Viral Video : దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై షార్ట్ విప్పేసి యువతిపై అత్యాచారయత్నం.. షాకింగ్ వీడియో
ఇక ట్విటర్ న్యాయవాది స్పిరో పంపిన లేఖలో.. ట్విటర్ వాణిజ్య రహస్యాలు, ఇతర అత్యంత గోప్యమైన సమాచారం తెలిసిన మాజీ ట్విటర్ ఉద్యోగులను మెటా నియమించుకుందని ఆరోపించారు. “ట్విటర్ తన మేధో సంపత్తి హక్కులను కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఏదైనా ట్విటర్ వ్యాపార రహస్యాలు లేదా ఇతర అత్యంత రహస్య సమాచారాన్ని ఉపయోగించడం మానేయడానికి మెటా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని స్పిరో లేఖలో పేర్కొన్నారు.
Earthquakes : పాక్,ఇండోనేషియా దేశాలను వణికించిన భూకంపం
ట్విటర్ను సొంత చేసుకున్న అనంతరం.. వింత వింత నిర్ణయాలతో యూజర్లను మస్క్ గందరగోళానికి గురి చేస్తున్నారు. పెయిడ్ బ్లూటిక్, సబ్స్క్రిప్షన్, ఎడిట్ బటన్, ట్వీట్ వ్యూ లిమిట్ చేయడం వంటి నిర్ణయాలు వినియోగదారులను అయోమయానికి గురి చేశాయి. కొన్ని నిర్ణయాలు తీసుకొని వెనక్కి తగ్గడం లాంటివి కూడా చేశారు. వాస్తవానికి సోషల్ మీడియా వేదికల్లో ట్విటర్కు ఎక్కువ క్రెడిబులిటీ ఉంది. కానీ మస్క్ నిర్ణయాలతో అది కాస్త తగ్గిందని టెక్ నిపుణులు ఓ సందర్భంలో తెలిపారు.
ఇక తాజాగా జూకర్బర్గ్ తీసుకువచ్చిన థ్రెడ్స్ కనుక సక్సెస్ అయితే ట్విటర్ పని అయిపోయినట్లేనని అంటున్నారు. దీంతో మస్క్ నష్ట నివారణకు పూనుకున్నారు. మెటాపై ఒత్తిడి తీసుకువచ్చి థ్రెడ్స్ యాప్ ఆపేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.