Vijayendra Prasad : హాలీవుడ్ రేంజ్లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. రాజమౌళి చేయడం కష్టమే.. జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఎప్పుడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్(RRR) (రౌద్రం రణం రుధిరం). దర్శకదీరుడు రాజమౌళి (SS Rajamouli)తెరకెక్కించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ విజయవంతమైంది.
![Vijayendra Prasad : హాలీవుడ్ రేంజ్లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. రాజమౌళి చేయడం కష్టమే.. జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఎప్పుడంటే..? Vijayendra Prasad : హాలీవుడ్ రేంజ్లో ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. రాజమౌళి చేయడం కష్టమే.. జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఎప్పుడంటే..?](https://10tv.in/wp-content/uploads/2023/07/RRR-sequel.jpg)
RRR sequel
Vijayendra Prasad on RRR sequel : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్(RRR) (రౌద్రం రణం రుధిరం). దర్శకదీరుడు రాజమౌళి (SS Rajamouli)తెరకెక్కించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ విజయవంతమైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సాధించి భారతీయ సినిమా ఖ్యాతిని చాటిచెప్పింది.
Anand Deverakonda : రష్మిక ను వదిన అని పిలవడంపై ప్రశ్న.. ఆనంద్ దేవరకొండ సమాధానం ఏంటంటే..?
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా..? ఉండదా..? అని ఎంతో మంది ప్రశ్నించినప్పటికీ రాజమౌళి సరియైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాగా.. ఆర్ఆర్ఆర్ సీక్వెల్(RRR 2) ఖచ్చితంగా ఉంటుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ (KV Vijayendra Prasad) తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సీక్వెల్కు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఎన్టీఆర్, రామ్చరణ్లే ఇందులోనూ నటిస్తారని, హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తాడా..? లేదంటే హాలీవుడ్ డైరెక్టర్ ఎవరైనా దర్శకత్వం వహిస్తారా..? అన్నది లేనిది ఇప్పుడే చెప్పలేమన్నాడు. ఏదీ ఏమైనప్పటికీ ఈ సినిమా మాత్రం రాజమౌళి పర్యవేక్షణలోనే రూపుదిద్దుకోనుందన్నారు.
జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడంటే..?
మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్టు అని దర్శకుడు రాజమౌళి ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇదేదో ఆశామాషీగా తీసే సినిమా కాదన్నాడు. ఇప్పుడు తనకున్న అనుభవం అందుకు సరిపోదని, ఇంకొంత అనుభవం సంపాదించాక అప్పుడు మహాభారతం మొదలు పెడుతానని చెప్పాడు. ఇందుకోసం చాలా వర్క్ చేయాలి. మహాభారతాన్ని తీస్తే 10 భాగాలు తీయాల్సి వస్తుందేమోనని అప్పట్లో జక్కన్న చెప్పిన సంగతి తెలిసిందే.
Karan Johar : కరుణ్ జోహార్ మీరు గే కదా..! ప్రశ్నించిన నెటీజన్.. ఆన్సర్ అదుర్స్
జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించనున్నారనే విషయాన్ని సైతం విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మహేశ్ బాబుతో తీసే సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇదిలా ఉంటే.. మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్గా రూపొందనుంది. మహేశ్-రాజమౌళి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.