Electric Shock Student Died : ఖమ్మం జిల్లా నవోదయ విద్యాలయంలో విద్యుత్ షాక్ కు గురై ఇంటర్ విద్యార్థి మృతి

ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్న క్రమంలో 11 కేవీ వైర్లు తగలడంతో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.

Electric Shock Student Died : ఖమ్మం జిల్లా నవోదయ విద్యాలయంలో విద్యుత్ షాక్ కు గురై ఇంటర్ విద్యార్థి మృతి

electric shock student died

Jawahar Lal Navodaya Vidyalaya : ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ లాల్ నవోదయ విద్యాలయంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కు గురై ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. పాలేరులోని జవహర్ లాల్ నవోదయ విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.

దీంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. విద్యాలయానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి చెందిన ఫ్లెక్సీ బ్యానర్లను విద్యార్థులు కడుతున్నారు. ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్న క్రమంలో 11 కేవీ వైర్లు తగలడంతో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.

Fire Accident : ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో భారీ అగ్ని ప్రమాదాలు

వీరిలో తీవ్ర గాయాలైన ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. దీంతో విద్యాలయంలో కలకలం రేగింది. కాగా, పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.