Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికెళ్లి అభినందించిన బండారు దత్తాత్రేయ

నేషనల్ అవార్డుకి ఎంపికైన అల్లు అర్జున్.. మన తెలంగాణ వ్యక్తి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను బన్నీ నివాసంలో గౌరవపూర్వకంగా కలుసుకున్నాడు.

Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికెళ్లి అభినందించిన బండారు దత్తాత్రేయ

Allu Arjun Haryana Governor Bandaru Dattatreya at his residence

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు (National Film Awards) గెలుచుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమలో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి యాక్టర్ అల్లు అర్జున్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంటి పలువు నాయకులు సోషల్ మీడియా ద్వారా బన్నీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Prathinidhi 2 : 16,32,96,000 సెక‌న్ల త‌రువాత కెమెరా ముందుకు నారా రోహిత్‌.. ప్ర‌తినిధి 2 షూటింగ్ మొద‌లు..

హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) సోమవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి బన్నీని అభినందించారు. పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించారు. కాసేపు ఆయనతో ముచ్చటించిన అల్లు అర్జున్.. టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎదుగుదల గురించి కూడా వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Jason Sanjay : దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్న తమిళ్ హీరో విజయ్ తనయుడు..

Allu Arjun Haryana Governor Bandaru Dattatreya at his residence

Allu Arjun Haryana Governor Bandaru Dattatreya

NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Allu Arjun Haryana Governor Bandaru Dattatreya at his residence

ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ ఈ నేషనల్ అవార్డులు అందుకోవడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయన్ గా నటిస్తుంటే మలయాళ యాక్టర్ ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక మొదటి పార్ట్ లో సమంతతో అదిరిపోయే ఐటెం సాంగ్ ని చేయించిన మేకర్స్.. సెకండ్ పార్ట్ లో ఎవరితో ఐటెం నెంబర్ ని ప్లాన్ చేస్తున్నారని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.