Allu Arjun : లండన్‌లో అల్లు అర్జున్.. భార్య స్నేహ రెడ్డితో..

లండన్ వెళ్లిన అల్లు అర్జున్. భార్య స్నేహ రెడ్డి బర్త్ డేని సెలబ్రేట్ చేయడానికే అక్కడికి వెళ్లాడా..?

Allu Arjun : లండన్‌లో అల్లు అర్జున్.. భార్య స్నేహ రెడ్డితో..

Allu Arjun is went for london for his wife Sneha Reddy birth day

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ షూటింగ్ కొంచెం బ్రేక్ ఇచ్చి లండన్ వెళ్లినట్లు తెలుస్తుంది. తాజాగా బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫొటోలో అల్లు అర్జున్ సూట్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఆ పోస్టుకి ‘లండన్’ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక ఈ పిక్ చూసిన అభిమానుల్లో.. బన్నీ లండన్ ఎందుకు వెళ్లాడని సందేహం మొదలైంది.

Shiva Rajkumar : సిద్దార్ధ్ క్షమించండి.. కన్నడ సినీ పరిశ్రమ తరపున సారీ చెప్పిన శివన్న

కాగా అల్లు అర్జున్ లండన్ వెళ్ళింది తన భార్య స్నేహ రెడ్డి బర్త్ డేని సెలబ్రేట్ చేయడం కోసమని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నేడు స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆమెకు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు. ఇక నిన్న అల్లు అర్జున్ లండన్ నుంచి ఫోటో షేర్ చేయడం, నేడు స్నేహ రెడ్డి పుట్టినరోజు కావడంతో.. తన వైఫ్ బర్త్ డేని సెలబ్రేట్ చేయడానికే అల్లు అర్జున్ లండన్ వెళ్లి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు.

Allu Arjun is went for london for his wife Sneha Reddy birth day

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)


Shiva Rajkumar : తెలుగు హీరోలపై ప్రసంశలు కురిపించిన శివన్న.. ఎవరెవరి గురించి అంటే?

అయితే మరికొంతమంది ఏమో మరో కారణం కూడా చెబుతున్నారు. ఇటీవల లండన్‌లోని ప్రఖ్యాతి మేడమ్‌ టుస్సాడ్స్‌ (Madame Tussauds) మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ విగ్రహం కోసం కొలతలు ఇవ్వడం కోసమే అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి ఉంటాడని
మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ భారీ యాక్షన్ సన్నివేశాలతో సిద్దమవుతుంది. డైరెక్టర్ సుకుమార్ సెకండ్ పార్ట్ ని మొదటి భాగాన్ని మించి ఉండేలా చిత్రీకరిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.