Paritala Sriram : నన్ను మిత్రుడిగానే చూడండి .. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు : పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు.

Paritala Sriram : నన్ను మిత్రుడిగానే చూడండి .. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు : పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

paritala sriram

Paritala Sriram sensational comments : నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లు బహిరంగ సభలో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతు..తాను అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు. ఇక్కడ చెట్లు నరికి చూసి.. తనకు చాలా బాధ కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. చెట్లు నరికే ఈ విష సంస్కృతికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

అటువంటి విష సంస్కృతికి ముగింపు పలకాలనే ఉద్ధేశ్యంతోనే తాను మొక్కలు పంచడం మొదలు పెట్టానని..తన తండ్రి పరిటాల రవీంద్ర ఇచ్చిన స్ఫూర్తితో ఈ కార్యక్రమం మొదలు పెట్టానని తెలిపారు. అప్పట్లో ప్రత్యర్థులు ఇళ్లు కూల్చివేస్తే.. పరిటాల రవి ఇళ్లు కట్టించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన రక్తాన్ని మాత్రమే కాదు ఆయన ఆశయాలను కూడా మేం పంచుకున్నామని వాటిని అమలు చేస్తున్నామని అన్నారు. అందుకే పది చెట్లు నరికితే 100చెట్లు పంచుతా..100నరికితే 1000, వెయ్యి నరికితే 10వేలు పంచుతా..10వేలు నరికితే లక్ష చెట్లు పెంచుతానని అన్నారు.

నవంబర్ 27నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం

ఇది ఎన్నికల కోసం అని అనుకోవద్దు..మొక్కలు పంచే కార్యక్రమం చాలా మంచిది. ఇది రాజకీయాల కోసం చేసే కార్యక్రమం కాదని స్పష్టంచేశారు. మొక్కలు పంచే ఈ కార్యక్రమం వెనుక నా తల్లి ప్రోత్సాహం ఉందని తెలిపారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎర్రన్నాయుడు తరహాలో పోరాడుతున్నారని అన్నారు. ఈ జిల్లాలో మొక్కలు నాటి చెట్లు పెంచటం అంటే ముందుగా గుర్తొచ్చిది మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అని అన్నారు.

రాజకీయాల్లో నిలబెట్టింది ఆయనే..
శ్రీ సత్యసాయి జిల్లాలో టిడిపి బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..తనను రాజకీయంగా నిలబెట్టింది పరిటాల రవీంద్రనే నని గుర్తు చేశారు. ఎవ్వరు బెదిరించినా లొగ్గవద్దని ఆయన నాకు చెప్పారని తెలిపారు. పరిటాల రవి, ఎర్రన్నాయుడు నిన్నటి తరం నాయకులుగా ఉన్నారని వారి వారసులుగా ..నేటి తరం నాయకులుగా పరిటాల శ్రీరామ్, రామ్మోహన్ నాయుడులు ఉన్నారని అన్నారు. ఎన్నికలు వస్తే తాడిపత్రి తరహాలో బెదిరింపులు వస్తాయన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డిలు మళ్లీ పాత ఆలోచనలకు వెళ్తున్నారు..కానీ పరిటాల శ్రీరామ్ ఎంతో విజ్ఞతతో వ్యవహరిస్తూ ధర్మవరంలో ముందుకు సాగుతున్నారని అన్నారు. శ్రీరామ్ కి ఇది రాజకీయంగా ఉపయోగపడకపోయినా ప్రజల్లో మార్పు వస్తుందని అన్నారు. అలాగే రామ్మోహన్ నాయుడు పొలిటికల్ డైనమేట్ గా కనిపిస్తారని ప్రశంసించారు. శ్రీరామ్, రామ్మోహన్ నాయుడు చదువుకున్న వారుగా.. కొత్త తరహాలో ముందుకు వెళ్తున్నారని అన్నారు.