MG Motor Car Price Hike : మారుతి, టాటా బాటలో ఎంజీ మోటార్.. 2024 జనవరిలో పెరగనున్న కార్ల ధరలు..!
MG Motor Car Price Hike : ఎంటీ మోటార్ రాబోయే కొత్త సంవత్సరం నుంచి ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో మొత్తం వాహన శ్రేణి ధరలను పెంచనుంది. కార్ల మోడల్లలో హెక్టర్, హెక్టర్ ప్లస్, ఆస్టర్, గ్లోస్టర్ ఎస్యూవీలు, కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ ఉన్నాయి.
MG Motor Car Price Hike : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. 2024 జనవరి నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఇండియా కంపెనీలు తమ కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. ఇప్పడు అదే బాటలో బ్రిటీష్ ఆధారిత కార్ల తయారీ సంస్థ, ఎంజీ మోటార్ ఇండియా కూడా తమ కార్ల మొత్తం లైనప్లో ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది.
ఇటీవల చైనా యజమాని ఎస్ఏఐసీ నుంచి భారతీయ సమ్మేళనం (JSW) ద్వారా 35 శాతం వాటాను కొనుగోలు చేసింది. రాబోయే నూతన సంవత్సరం నుంచి మొత్తం వాహన శ్రేణిలో ధరలను పెంచడానికి సిద్ధంగా ఉంది. ధరలు పెరగనున్న కార్ల పోర్ట్ఫోలియోలో హెక్టర్, హెక్టర్ ప్లస్, ఆస్టర్, గ్లోస్టర్ ఎస్యూవీలు, కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ అనే 2 ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మొత్తం 5 మోడల్స్ ఉన్నాయి.
కార్ల ధరల పెంపునకు కారణాలివే :
ముఖ్యంగా, కార్మేకర్ ఈ ఏడాది ఆగస్టులో ఫ్లాగ్షిప్ ఎస్యూవీలు హెక్టర్, గ్లోస్టర్ ధరలను పెంచింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగా ఎంజీ మోటార్ ధరలను పెంచాలనే నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో కార్ల తయారీ సంస్థ తెలిపింది. మొత్తం ద్రవ్యోల్బణం, పెరిగిన వస్తువుల ధరల కారణంగా కార్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్టు పేర్కొంది.
Read Also : Maruti Suzuki Swift 2024 : కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 భారత్కు వచ్చేస్తోంది.. ఫొటోలు చూశారా?
ధరల పెరుగుదలపై కంపెనీ నిర్దిష్ట వివరాలు వెల్లడించనప్పటికీ, అధిక ధరల ప్రభావాన్ని తగ్గించడానికి ముందస్తు చర్యగా 2023 ఏడాది చివరిలో ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెడతామని ఎంపీ మోటార్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. అయితే, ఈ ఆఫర్లు వచ్చే జనవరి నుంచి అమలులోకి రానున్నాయి. ట్రెండ్ను అనుసరించి.. ధరల పెంపును ప్రకటించిన భారత్లోని 5వ ప్రముఖ కార్ తయారీదారుగా ఎంజీ మోటార్ అవతరించింది.
వచ్చే జనవరిలో కార్ల ధరలను పెంచనున్న కంపెనీలివే :
అంతకుముందు, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ కూడా జనవరి నుంచి కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి. దేశంలోని రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కూడా సమీప భవిష్యత్తులో తన మోడళ్లకు ధరల పెంచాలనే యోచనలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఎంజీ మోటార్ కార్లలో హెక్టర్ గ్లోస్టర్ ఎస్యూవీల ధరలను పెంచిన మూడు నెలల తర్వాత ధరలో మార్పులు చేసింది. విశేషమేమిటంటే.. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో ఈ రెండు ఎస్యూవీలకు రెండో ధర పెరుగుదలను సూచిస్తుంది.
గతంలో ఎస్యూవీ మోడల్, వేరియంట్ను బట్టి మారుతూ రూ.78వేల వరకు ధరను పెంచాయి. ముఖ్యంగా, ఈ పెరుగుదల ఈ ఏడాది మేలో ఎంజీ మోటార్ ద్వారా అన్ని మోడళ్లను అధిగమించింది. అంతేకాకుండా, హెక్టర్ ఎస్యూవీ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ముఖ్యమైన అప్డేట్ ప్రకటించింది. పన్నెండు నెలల వ్యవధిలో మూడోసారి రూ. 15 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు పెంచింది. హెక్టర్ ఎస్యూవీ పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్లలో అందిస్తోంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)తో అందిస్తుంది. ప్రస్తుతం ఎంజీ తన కార్లను రూ. 7.98 లక్షల నుంచి రూ. 43.87 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో విక్రయిస్తోంది.