Varanasi : వారణాసి ఆశ్రమంలో నలుగురు ఆంధ్రా కుటుంబ సభ్యుల ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం వరణాసి యాత్రకు వచ్చి ఇక్కడి ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది.ఆర్థిక సమస్యలతో నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. తెలుగులో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు.....

Varanasi : వారణాసి ఆశ్రమంలో నలుగురు ఆంధ్రా కుటుంబ సభ్యుల ఆత్మహత్య

Varanasi ashram

Varanasi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం వరణాసి యాత్రకు వచ్చి ఇక్కడి ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన భార్య, భర్త,ఇద్దరు కుమారులు ఆధ్యాత్మిక యాత్ర కోసం డిసెంబరు 3వతేదీన వరణాసికి వచ్చారు. వారు డిసెంబరు 7వతేదీన ఆంధ్రాకు తిరిగి రావాల్సి ఉండగా రాలేదు. వారు బస చేసిన ఆశ్రమంలోని గది లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. వరణాసి పోలీసు అధికారులు వారి గది తలుపులు బలవంతంగా తెరిచి చూడగా వారు శవమై కనిపించారు.

ALSO READ : CM Revanth Reddy : విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఎం రేవంత్ సీరియస్, సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశం

ఆర్థిక సమస్యలతో నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. తెలుగులో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. భర్త ఆంధ్రప్రదేశ్‌లోని తన కార్యాలయంలోని ఒకరితో ఆర్థిక వివాదంలో ఉన్నట్లు నోట్‌లో సూచించినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని, వారు ఆశ్రమంలో ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారని వరణాసి పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై వరణాసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.