Flipkart Year End Sale 2023 : ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2023.. ఐఫోన్ 14, రెడ్మి 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ మిస్ చేసుకోవద్దు!
Flipkart Year End Sale 2023 : ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కస్టమర్ల కోసం 2023కి సంబంధించిన లేటెస్ట్ ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమైంది. డిసెంబరు 9 నుంచి ఈ డీల్లను అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14, రెడ్మి 12 సహా ఇతర ఫోన్లపై మరిన్ని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Flipkart Year End Sale 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ 2023కి సంబంధించిన లేటెస్ట్ ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమైంది. ముందుగా ప్లస్ మెంబర్షిప్ ఉన్నవారి కోసం ఈ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగతా వారందరికి డిసెంబర్ 9 నుంచి స్మార్ట్ఫోన్లపై డీల్లను యాక్సెస్ చేససుకోవచ్చు. మునుపటి పండుగ విక్రయాలను కోల్పోయిన వినియోగదారులకు మరో అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.
ప్రస్తుతం అనేక జనాదరణ పొందిన స్మార్ట్ఫోన్లు అమ్మకానికి ఉన్నందున ఈ డీల్ మిస్ చేసుకోవద్దు. ఈ సేల్ డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది. అంటే.. ఏదైనా కొనుగోలు చేసే ముందు వినియోగదారులకు చాలా సమయం ఉంటుంది. 2023 ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం. అవేంటో ఓసారి లుక్కేయండి.
బ్యాంకు ఆఫర్లు లేకుండానే తక్కువ ధరకు :
2023 ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14, రెడ్మి 12 సహా మరిన్నింటిపై భారీ తగ్గింపులను పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 విక్రయ సమయంలో రూ. 54,999 ఖర్చు అవుతుంది. ఐఫోన్ 14లో ఇదే అత్యల్ప తగ్గింపుగా చెప్పవచ్చు. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా రూ. 57,999 ధర ట్యాగ్తో లిస్టు అయింది. దీని అసలు ధర రూ. 69,900 నుంచి తగ్గింది. ఈ ఐఫోన్పై ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ 2023 ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా రూ.65,999కి విక్రయిస్తోంది.
రెడ్మి, మోటోరోలా ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు :
మోటోరోలా ఎడ్జ్ 40 ఎక్స్ఛేంజ్ ఆఫర్తో సహా రూ. 25,499 ధరలో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ వాస్తవానికి రూ. 29,999కి లాంచ్ అయింది. వినియోగదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్ను వద్దనుకుంటే.. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.26,299కి కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ సేల్ సమయంలో డివైస్కు మంచి డిస్కౌంట్ పొందాలంటే.. బడ్జెట్ ఫోన్ రెడ్మి 12 4జీని కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ రూ. 9,999 నుంచి తగ్గి రూ.9,499కి తగ్గింది. పోకో ఎమ్6 ప్రో 5జీని రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు. తద్వారా చిప్సెట్, ఇతర ఫీచర్లు తక్కువ ధరకే పొందవచ్చు.
ఈ డివైజ్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 6.79-అంగుళాల ఎఫ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. రూ. 6వేల కన్నా తక్కువ బడ్జెట్ కలిగి ఉంటే.. అప్పుడు పోకో సీ51ని కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.5,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 7ఎ మోడల్ రూ. 37,999కి కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లతో కూడా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, మోటో జీ54 5జీ మోడల్ వివో టీ2 ప్రో కూడా వరుసగా రూ. 13,999, రూ. 23,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.