Tollywood : డ్రగ్స్ విషయంలో సినిమా ఇండస్ట్రీని హెచ్చరించిన హైదరాబాద్ కొత్త సీపీ..

హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడిన ఆయన డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమని కూడా హెచ్చరించారు.

Tollywood : డ్రగ్స్ విషయంలో సినిమా ఇండస్ట్రీని హెచ్చరించిన హైదరాబాద్ కొత్త సీపీ..

Hyderabad New CP Kothakota Sreenivasa Reddy warning to Film Industry

Tollywood : తెలంగాణలో(Telangana) కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అనేక హోదాల్లో కొత్త అధికారులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త సీపీలను ప్రకటించగా హైదరాబాద్(Hyderabad) సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Kothakota Sreenivasa Reddy) నేడు బాధ్యతలు స్వీకరించారు. రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటల్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా నిలబెడతామని తెలిపారు. తన శక్తి సామర్థ్యాలు గురించి సీపీగా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పలు అంశాలపై మాట్లాడిన ఆయన డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమని కూడా హెచ్చరించారు.

సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి డ్రగ్స్ అంశం గురించి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో కూడా కొంతమంది డ్రగ్స్ సేవిస్తున్నట్టు గుర్తించాము. సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ పెడతాం. కొంతమంది సినీ వర్గాల వాళ్ళు ఇలాంటి పార్టీలని ప్రోత్సహిస్తున్నారు. డిమాండ్ ఉంది కాబట్టే సప్లై ఉంది. సినీ పెద్దలకు మీలో మీరు మీటింగ్స్ పెట్టుకొని డ్రగ్స్ నుంచి సిటీని ఫ్రీగా చేయమని చెప్తాము. వాళ్ళు చొరవ తీసుకోవాలి. మేము కూడా వాళ్ళని కలిసి మాట్లాడతాము అని అన్నారు. దీంతో డ్రగ్స్ అంశం మరోసారి టాలీవుడ్ లో చర్చగా మారింది.

Also Read : Prashanth Neel : అప్పుడు కేజిఎఫ్.. ఇప్పుడు సలార్.. షారుఖ్ మీద పోటీకి ప్రశాంత్ నీల్..

గతంలో పలుమార్లు డ్రగ్స్ కేసు బయటకి వచ్చినప్పుడల్లా సినీ పరిశ్రమలోని ఎవరో ఒకరి పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం కూడా నవదీప్ పేరు వినిపించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీపీ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడుతున్నారని అనడం, సినీ పెద్దలతో మీటింగ్ పెడతామని చెప్పడంతో టాలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.