Ambati Rayudu : ఎన్నికల ఫలితాలపై అంబటి రాయుడు ట్వీట్.. ఏపీకి మంచి రోజులు వచ్చాయ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన -బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు ఆనందం వ్యక్తం చేశాడు.
Ambati Rayudu tweet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన -బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు ఆనందం వ్యక్తం చేశాడు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని వ్యాఖ్యానించాడు. ఇది ప్రజల విజయం అని, ఈ అఖండ విజయంలో నారా లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని చెప్పాడు.
‘ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంలో నారా లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని ట్వీట్ చేశారు.
This is a great victory of the people of Andhra Pradesh.. congratulations to @JanaSenaParty @JaiTDP @BJP4India.Pavan Kalyan garu and @ncbn garu have united the state to take it on the path of progress and prosperity. Great times ahead for Andhra Pradesh under their able… pic.twitter.com/61p1iuO9NT
— ATR (@RayuduAmbati) June 4, 2024
ఉదయం 11.30 గంటల సమయానికి 150 కు పైగా స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది. తెలుగు దేశం పార్టీ 132 స్థానాల్లో జనసేన 19 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా అధికార వైసీపీ 17 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.