అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది: ప్రతిపక్ష నేతగా జగన్ ట్వీట్

YS Jagan: ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామన్నారు.

అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది: ప్రతిపక్ష నేతగా జగన్ ట్వీట్

YS Jagan

టీడీపీ కార్యకర్తల అరాచకాలను అడ్డుకోండంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని జగన్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే స్వైరవిహారం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

‘ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’ అని జగన్ చెప్పారు.

కాగా, అమరావతిలో వైఎస్ జగన్ తో ఆ పార్టీ నేతల సమావేశం ముగిసింది. సాయత్రం 5 గంటలకు గవర్నర్ ను కలవనున్నారు
వైఎస్సార్సీపీ నేతలు. కౌంటింగ్ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల పై జరుగుతున్న దాడులపై పిర్యాదు చేయనున్నారు. మరోవైపు, ఏపీలో జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌ కు బాధితులు లేఖ రాశారు.

Also Read: రోజాపై వైసీపీ నాయకురాలు కేజే శాంతి ఫైర్.. నగరికి పట్టిన శని వదిలిందంటూ వీడియో