దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్.. ఆ ఇంటికి చేరుకున్న దివ్వల మాధురి
అక్కడకు వచ్చిన మాధురిపై దువ్వాడ వాణి, కుమార్తె నవీన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్ ఎదురైంది. శ్రీకాకుళం టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు నెలరోజులుగా దువ్వాడ భార్య వాణి, బిడ్డలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆ వివాదాస్పద ఇంటికి దివ్వల మాధురి చేరుకున్నారు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లేందుకు వాణి ప్రయత్నించారు. ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని వాణి చెబుతున్నారు. అక్కడకు వచ్చిన మాధురిపై దువ్వాడ వాణి, కుమార్తె నవీన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే దువ్వాడ వాణి నిరసన తెలుపుతున్నారు. మాధురి అనే వివాహితతో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహిత సంబంధం పెట్టకున్నాడంటూ వాణి ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.
ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన ఇష్యూ.. ఇల్లు పీకి పందిరేసేంతగా మారింది. ఈ కుటుంబ పంచాయితీ రాజకీయంగా దువ్వాడకు నష్టం చేసే ప్రమాదం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంన్నాయి.
Also Read: నేను కూడా టీపీసీసీ అధ్యక్షుడిని కావాలనుకున్నా.. ఎప్పటికైనా..: జగ్గారెడ్డి