Rohit Sharma : స్వ‌దేశానికి చేరుకున్న రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్వ‌దేశానికి చేరుకున్నాడు.

Rohit Sharma : స్వ‌దేశానికి చేరుకున్న రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్‌

Rohit Sharma returns to India from the USA ahead of IND vs SL Series

Rohit Sharma returns to India : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్వ‌దేశానికి చేరుకున్నాడు. బుధ‌వారం రాత్రి అత‌డు త‌న కుటుంబంతో క‌లిసి ముంబై విమానాశ్ర‌యంలో క‌నిపించాడు. రోహిత్ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 విజేత‌గా నిలిచింది. 17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా మ‌రోసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌ను గెలుచుకోవ‌డంతో ముంబైలో విజ‌యోత్స‌వ ర్యాలీని నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో పాల్గొన అనంత‌రం రోహిత్ శ‌ర్మ త‌న భార్య రితికా స‌జ్జే, కూతురు స‌మైరాతో క‌లిసి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

ఇటీవ‌ల కార్లోస్ అల్కరాజ్, డానియల్ మెద్వెదేవ్ మధ్య జరిగిన వింబుల్డ‌న్ 2024 సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను రోహిత్‌ ప్ర‌త్య‌క్షంగా వీక్షించాడు. అనంత‌రం డ‌ల్లాస్‌కు చేరుకున్న రోహిత్ శ‌ర్మ అక్క‌డ వివిధ కార్యక్ర‌మాల్లో పాల్గొన్నారు. లంక‌తో వ‌న్డే సిరీస్ నేప‌థ్యంలో త‌న సెల‌వుల‌ను ముగించుకున్న రోహిత్.. కుటుంబంతో క‌లిసి ముంబైలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IND vs SL : భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు వ‌రుస షాక్‌లు.. మ‌రో పేస‌ర్ దూరం..

టీ20ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ కేవ‌లం వ‌న్డేలు, టెస్టులు మాత్ర‌మే ఆడ‌తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లంక‌తో వ‌న్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. కొత్త‌గా కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన గౌత‌మ్ గంభీర్ కోరిక మేర‌కు రోహిత్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్లుగా స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 2 నుంచి లంక‌తో ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్‌లో రోహిత్ సార‌థ్యంలోనే భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది.

మ‌రోవైపు సూర్య‌కుమార్ యాద‌వ్ సార‌థ్యంలో టీ20 సిరీస్ ఆడేందుకు ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు శ్రీలంక‌లో అడుగుపెట్టింది. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మ‌నీ.. ఎప్పుడు, ఫ్రీగా ఎలా చూడాలంటే..?