తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఇళ్లను తీసుకోలేదు. నిన్నటి కేబినెట్ సమావేశంలో పట్టణ ప్రాంతంలో మూడు లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Kishan Reddy : బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీతో సంప్రదింపులు ఏమీ లేవని చెప్పారు. అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీడియాకే చెబుతానంటూ కిషన్ రెడ్డి అన్నారు. సామాజిక అసమానతల కారణంగా దళిత రిజర్వేషన్లు ఇచ్చారు. క్రిమీలేయర్ విషయంలో ఆలోచించమని చెప్పింది తప్ప ఆదేశించలేదు. ప్రస్తుతం ఏ పద్ధతి కొనసాగుతుందో అదే పద్ధతి కొనసాగుతుందని కిషన్ రెడ్డి అన్నారు.

Also Read : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌ కుటుంబ వ్యవహారంలో మ‌రో ట్విస్ట్ ..

గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఇళ్లను తీసుకోలేదు. నిన్నటి కేబినెట్ సమావేశంలో పట్టణ ప్రాంతంలో మూడు లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఇళ్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపాదనలు రాగానే ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా ప్రధానిని కోరానని అన్నారు.

Also Read : Telangana: బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నాం. అధ్యక్ష మార్పు అంశం, ఎన్నికల సన్నద్ధతకు సంబంధం లేదని అన్నారు. జమ్ము-కాశ్మీర్ పర్యటనకు త్వరలో వెళ్తున్నాను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్లోలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.