షెరటన్ హోటల్‌లో సీఎల్పీ సమావేశం.. మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని, దీనిపై ఢిల్లిలో చర్చలు జరుగుతున్నాయని..

షెరటన్ హోటల్‌లో సీఎల్పీ సమావేశం.. మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని షెరటన్ హోటల్‌లో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరుగుతోంది. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు.

ఈ సందర్భంగా షెరటన్ హోటల్ వద్ద మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… మునిగిపోయిన బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని, దీనిపై ఢిల్లిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని అన్నారు.

మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ నియోజక వర్గాల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. తాము ప్రచారం చేయకపోయినా 2018లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చాయని, బీఆర్ఎస్ పార్టీకీ ఇప్పుడు ఒక్కటీ రాలేదని చెప్పారు. కాగా, రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

Also Read: పైకి స్పా సెంటర్, లోపల పాడు పనులు..! హైదరాబాద్ కూకట్‌పల్లిలో ముఠా గుట్టురట్టు