Goru Chikkudu : గోరు చిక్కుడు సాగులో యాజమాన్యపద్ధతులు !
మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్ర గరప నేలలు , ఒండ్రు నేలలు అనుకూ లం. అధిక సాంద్రతగల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.0, 8.0 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటాయి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తినట్లయితే రైజోబియం క్చర్ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
Goru Chikkudu : గోరు చిక్కుడు ఉష్ణమండల పంట. అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఇది తక్కువ నీటి సౌకర్యంతో కూడా పెరుగుతుంది. కరువు పరిస్థితుల్లో, బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా పండించవచ్చు. దీన్ని కూరగాయగా కాకుండా కొమ్మలు పెరిగే గోరుచిక్కుడు రకాలను పచ్చిమేతగానూ, గింజలు పశువులకు దాణాగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా పచ్చిరొట్ట ఎరువుగా, ఔషధ తయారీలోనూ వాడతారు. గోరుచిక్కుడు గింజల నుండి జిగురు తయారు చేస్తున్నారు. ఈ జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్యసాధనాలలో, తిండిపదార్థాల పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు పచ్చిమేతగా, గింజలను దాణాగా, కూరగాయగా వాడే గోరు చిక్కుడు రెండు, మూడు సంవత్సరాల్లో ముఖ్యమైన విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా మారింది.
మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్ర గరప నేలలు , ఒండ్రు నేలలు అనుకూ లం. అధిక సాంద్రతగల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.0, 8.0 మధ్య గల నేలలు అనుకూలంగా ఉంటాయి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తినట్లయితే రైజోబియం క్చర్ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వర్షాకాలంలో 60 సెం.మీ దూరంలో కాలువలు, బోదేలు చేసుకోవాలి. వేసవిలో చిన్నమళ్ళుగా చేసి విత్తుకోవాలి.
పూసా మౌసమి రకం ఖరీఫ్ పంటకు అనువైనది. గింజ విత్తిన 70 -80 రోజులకు మొదటికోతకు వస్తుంది. కాయలు 10-12 సెం.మీ పొడవుంటాయి. మొక్క కొమ్మతో ఉంటుంది. పూసా సదాబహార్ ఖరీఫ్, వేసవి పంటకు అనువైనది. గింజ విత్తిన 45-50 రోజులకే మొదటికోతకు వస్తుంది. కాయలు 12-13 సెం.మీ పొడవుంటాయి. మొక్క కొమ్మతో ఉంటుంది. పూసా నవబహార్ దీని కాయలు పూసా మౌసమి మాదిరిగా ఉంటాయి. మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది. ఖరీఫ్, వేసవి పంటకు అనువైన రకం. గౌరీ ఇది ఖరీఫ్, వేసవి పంటకు అనువైనది.
జూన్, జులై, జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తే ముందు ఒక కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్, 8 గ్రా. ట్రైకోడెర్మావిరిడి కలిపి విత్తన శుద్ది చేయాలి. విత్తే దూరం విషయానికి వస్తే ఖరీఫ్ పంట 60 x15 సెం.మీ, వేసవి పంట 45 x 15 సెం.మీ ఉండేలా చూడాలి. వేసవిలో మొక్క సాంద్రత ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి.
ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్నిచ్చే ఎరువు వేసుకోవాలి. సగం నత్రజని పూర్తి భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వేయాలి. కలుపు నివారణకు పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1.25 లీ., అలాక్లోర్ 1 లీ. తేలిక నేలలు 1.25 లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి నాటిన 48 గంటలోపు పిచికారి చేసుకోవాలి.
గింజలు విత్తగానే నీరు పారించాలి. మూడవ రోజు మరల ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి 4-10 రోజుల కొకసారి నీటి తడులివ్వాలి. చిన్న పెద్ద పురుగు లేత చిగుళ్ళు ఆకు నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమటాన్ లేదా పాసలోన్ లేదా పిప్రోనిల్లోని ఏదైనా ఒక మందును 2 మి.లీ లీటరు నీటికి కలిపి మందు మారుస్తూ పిచికారి చేయాలి. ఆకు మీద నల్లని మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎండు తెగులు వస్తే మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి 8 గ్రా. విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. కిలో ట్రైకోడెర్మావిరిడి, 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలో వేప పిండితో కలిపి వారం రోజులు నీడలో మాగనిచ్చి ఆఖరిదుక్కిలో వేసుకోవాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నే తడిచేలా పొయ్యాలి. పంట మార్పిడి పాటించాలి.
లేత కాయలను కోసి మార్కెట్కు పంపాలి. ముదిరిన కాయల్లో పీచుశాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గుతుంది. ఒక ఎకరాకు 20-25 క్వింటాళ్ళు వస్తుంది. కోత అనంతరం ఒక శాతం ఉప్పు ద్రావణంలో గోరుచిక్కుడు కాయల మొక్కను ముంచి 10 నిమిషాల తరువాత తీసి ఆరబెట్టాలి.