Andhra Pradesh : ఏపీ బడ్జెట్ 2021-22, ఎవరెవరికి ఎంతెంత?

ఏపీ శాసన సభ ప్రారంభమైంది. 2021, మే 20వ తేదీ గురువారం ఉదయం..ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Andhra Pradesh : ఏపీ బడ్జెట్ 2021-22, ఎవరెవరికి ఎంతెంత?

Ap

Andhra Cabinet : ఏపీ శాసన సభ ప్రారంభమైంది. 2021, మే 20వ తేదీ గురువారం ఉదయం..ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

2021–22 రాష్ట్ర బడెట్‌ అంచనా రూ. 2,29,779.27 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా రూ. 2,24,789.18 కోట్లు
2020–21తో పోలిస్తే వెనకబడిన కులాల బడ్జెట్‌లో 32 శాతం అధికంగా కేటాయింపులు, బడ్జెట్‌లో రూ. 28,237 కోట్లు ( 2020–21లో రూ.21,317.24 కోట్లు)
ఈబీసీ సంక్షేమంలో 8 శాతం అధిక కేటాయింపులు, బడ్జెట్‌ రూ.5,478కోట్లు (2020–21లో రూ.5,088.55 కోట్లు)

కాపు సంక్షేమంకోసం 7 శాతం అధిక కేటాయింపులు, 3,306 కోట్లు (2020–21లో రూ.3,090 కోట్లు)
బ్రాహ్మణుల సంక్షేమంలో 189 శాతం అధిక కేటాయింపులు, రూ.359 కోట్లు (2020–21లో రూ.124 కోట్లు)
ఎస్సీ సబ్‌ప్లాన్‌లో 22 శాతం అధిక కేటాయింపులు, రూ. 17403 కోట్లు (2020–21లో రూ. 14,218కోట్లు)
ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 27శాతం అధిక కేటాయింపులు, రూ. 6,131కోట్లు (2020–21లో రూ.4,814 కోట్లు)

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కింద రూ. 3,840.72 కోట్లు దీంతో పాటు మైనార్టీ సబ్‌ప్లాన్‌లో 7శాతం పెరుగుదల, రూ.1756 కోట్లు (2020–21లో రూ. 1634 కోట్లు)
పిల్లలు, చిన్నారులకోసం బడ్జెట్‌లో రూ. 16,748 కోట్లు మహిళల అభివృద్ధికి రూ. 47,283.21 కోట్లు
వ్యవసాయ పథకాలకు కేటాయింపులు 11,210 కోట్లు
విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు

వైద్యం– ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
డీబీటీ పథకాల వారీగా కేటాయింపులు :

(ఈ పథకాల కింద నేరుగా నగదు బదిలీ)
వైయస్సార్‌ పెన్షన్‌కానుక రూ. 17,000 కోట్లు
వైయస్సార్‌ రైతు భరోసాకు రూ. 3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెనకు రూ.2500 కోట్లు
జగనన్న వసతి దీవెనకు రూ. 2,223.15 కోట్లు
వైయస్సార్‌ – పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ. 1,802 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ. రూ.865 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు పై పథకం కింద రూ. 247 కోట్లు, మొత్తంగా రూ. 1,112 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపులు కోసం రూ. 500 కోట్లు
వైయస్సార్‌ కాపు నేస్తంకోసం రూ. 500 కోట్లు
వివిధ పథకాల కింద కాపు సామాజికవర్గ సంక్షేమంకోసం రూ. 3,306 కోట్లు
వైయస్సార్‌ జగనన్న చేదోడు పథకంకోసం రూ.300 కోట్లు
వైయస్సార్‌ వాహన మిత్ర పథకంకోసం రూ. 285 కోట్లు

వైయస్సార్‌ నేతన్న నేస్తంకోసం రూ. 190 కోట్లు
వైయస్సార్‌ మత్స్యకార భరోసా కోసం రూ. 120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ. 50 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులకోసం రూ. 200 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషి కింద ( దురదృష్టవశాత్తూ ఆత్మహత్యకు పాల్పడితే) రూ.20 కోట్లు

లా నేస్తకోసం రూ. 16.64 కోట్లు
ఈబీసీ నేస్తంకోసం రూ. 500 కోట్లు
వైయస్సార్‌ ఆసరాకోసం రూ. 6,337 కోట్లు
అమ్మ ఒడి కోసం రూ. 6,107 కోట్లు
వైయస్సార్‌ చేయూత కోసం రూ. 4,455 కోట్లు
రైతుల పథకాలకు రూ. 11,210.80 కోట్లు

వైయస్సార్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ. 88.57 కోట్లు
వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1802.82 కోట్లు
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ. 739.46 కోట్లు
వైయస్సార్‌ పశువుల నష్టపరిహార పథకానికి రూ. 50 కోట్లు
విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లు

దీంట్లో స్కూళ్లలో నాడు–నేడుకు రూ. 3,500 కోట్లు
జగనన్న గోరుముద్దకోసం రూ. 1,200కోట్లు
జగనన్న విద్యాకానుక కోసం రూ. 750 కోట్లు
ఉన్నత విద్యకోసం రూ. 1,973 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు

డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ, మందుల కొనుగోలు కోసం రూ. 2,248.94 కోట్లు
ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలకోసం రూ. 1,535 కోట్లు
కోవిడ్‌పై పోరాటానికి రూ. 1000 కోట్లు
ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కోసం రూ.100 కోట్లు
పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు
హౌసింగ్‌ కోసం, మౌలిక సదుపాయాకోసం మొత్తంగా రూ. 5,661 కోట్లు

పరిశ్రమలకు ఇన్సెంటివ్‌లకోసం రూ.1000 కోట్లు
వైయస్సార్‌ ఎలక్ట్రానిక్‌మాన్యుఫాక్చరింగ్‌ కోసం రూ. 200 కోట్లు
కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం రూ. 250 కోట్లు
ఏపీఐఐసీకి రూ. 200 కోట్లు
ఎంఎస్‌ఎంఈల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 60.93 కోట్లు
పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 3,673.34 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు 2021–22 సంవత్సరంలో రూ. 7,594.6 కోట్లు
ఎనర్జీ రంగానికి రూ. 6,637 కోట్లు
వైయస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు
వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ. 243.61 కోట్లు
దిశకు రూ. 33.75 కోట్లు

అంగన్‌వాడీల్లో నాడు – నేడు కార్యక్రమాలకోసం రూ. 278 కోట్లు
వైయస్సార్‌ బీమాకు రూ. 372.12 కోట్లు
అర్చకులకు అన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు
ఇమామ్స్, మౌజంలకు ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు
పాస్టర్లకు ఇన్సింటివ్‌లకు రూ. 40 కోట్లు

ల్యాండ్‌ రీ సర్వేకోసం రూ. 206.97 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 8,727 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే 7.2శాతం అధికం.
2021–22లో నీటిపారుదల శాఖకు రూ. 13,237.78 కోట్లు గత ఏడాదితో పోలిస్తే రూ. 12.13 శాతం ఎక్కువ

Read More :Cab Drivers : లాక్ డౌన్ దెబ్బకు అల్లాడుతున్న క్యాబ్ డ్రైవర్లు