AP Cabinet: అంబటి.. విషయ పరిజ్ఞానంలో మేటి.. మాటల దాడిలో లేరు సాటి..!

ప్రతిపక్షాల చేసే డిమాండ్స్, విమర్శలకు విడమరిచి చెప్పడం ఆయన ప్రత్యేకత. వ్యక్తిగతంగా కొంతమంది అంబటిని లక్ష్యంగా చేసుకున్నా.. కఠినంగా తట్టుకుని నిలబడ్డారని...

AP Cabinet: అంబటి.. విషయ పరిజ్ఞానంలో మేటి.. మాటల దాడిలో లేరు సాటి..!

Ambati

Ambati Rambabu Profile : ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు స్టైలే వేరు. ప్రత్యర్థులపై పంచ్ లు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కింది. కానీ.. ఈ మంత్రి పదవి అంత ఈజీగా రాలేదంటారు కొంతమంది. రాజకీయాల్లో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ప్రతిసారి తట్టుకుని నిలబడ్డారు అని చెప్పవచ్చు. ప్రతిపక్షాల చేసే డిమాండ్స్, విమర్శలకు విడమరిచి చెప్పడం ఆయన ప్రత్యేకత. వ్యక్తిగతంగా కొంతమంది అంబటిని లక్ష్యంగా చేసుకున్నా.. కఠినంగా తట్టుకుని నిలబడ్డారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయనకు ఏ బాధ్యత ఇచ్చినా.. దానికి నూటికి నూరు శాతం న్యాయం చేయడం వల్లే.. ఆయనకు మంత్రి పదవి దక్కిందంటారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆ పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు.

Read More : Mekathoti Sucharitha Resign : వైసీపీలో కేబినెట్ చిచ్చు.. ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా

ఇక ఆయన రాజకీయ నేపథ్యం విషయానికి వస్తే…

గుంటూరు జిల్లా రేపల్లేలో ఏవీ ఎస్ఆర్ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ దంపతులకు ఆయన జన్మించారు. 1986లో విశాఖపట్టణంలో న్యాయ విద్యా పరిషత్ కాలేజీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. రాజకీయాల పట్ల ఆకర్షితులైన ఆయన.. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ గా పని చేశారు. 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి దక్కింది. అంతేగాకుండా.. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా పని చేశారు. ఆయన సేవలను చూసిన కాంగ్రెస్ పార్టీ 1989లో రేపల్లే నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది.

Read More : Minister Roja : నెరవేరిన ఎమ్మెల్యే రోజా కల.. ఎట్టకేలకు మంత్రి పదవి ఇచ్చిన సీఎం జగన్

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అంబటి తొలిసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అనంతరం 2019లో సత్తెనపల్లి నుంచి అంబటి పోటీ చేశారు. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ పై 20 వేల 876 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోడెల విజయం తర్వాత.. విపక్షాలు ఆయనపై టార్గెట్ చేశాయి. కానీ..వీటన్నింటినీ తట్టుకుని.. పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని అంటారు. మంత్రి పదవి దక్కిన అంబటి రాంబాబుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.