APPSC : ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్‌1 ఫలితాలు

2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై సందిగ్దత వీడింది. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది.

APPSC : ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్‌1 ఫలితాలు

Appsc

APPSC : 2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై సందిగ్దత వీడింది. ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. అయితే మొదట ఈ పరీక్షల మూల్యాంకనం డిజిటల్ విధానం చేశారు. అయితే సెలెక్ట్ అవని అభ్యర్థులు దీనిపై అభ్యంతరం తెలిపారు. 2018 గ్రూప్-1 మెయిన్స్ డిజిటల్ విధానం ద్వారా మూల్యాంకనం గురించి నోటిఫికేషన్‌లో పేర్కొనకపోవడంతో సెలెక్ట్ అవని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు డిజిటల్ ఫలితాలను హోల్డ్‌లో పెట్టింది.

చదవండి : APPSC Jobs : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

అయితే నోటిఫికేషన్ లో మూల్యాంకనం విషయం పెట్టనప్పటికీ.. పరీక్షలకు ముందునుంచే అభ్యర్థులకు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా, మీడియా ద్వారా తెలియచేస్తూ వచ్చింది. పరీక్షకు ముందు అభ్యర్థులు ఎవరు ఈ విధానానికి అభ్యంతరం చెప్పలేదు.. తీరా ఫలితాలు విడుదల చేసిన తర్వాత సెలెక్ట్ అవని అభ్యర్థులు డిజిటల్ విధానంపై అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అభ్యర్థుల అనుమానాలను, సందేహాలను కోర్టు ఆమోదించలేదు.

చదవండి : APPSC Notification : ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపిపిఎస్సీ నోటిఫికేషన్

కేవలం మూల్యాంకన విధానం సరైన రీతిలో అమలు చేయనందున ఈసారికి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్‌సీ మాన్యువల్‌ మూల్యాంకనానికే మొగ్గు చూపింది. మూల్యాంకనాన్ని త్వరితంగా ముగించి ఫిబ్రవరి నెలలో ఫలితాలను విడుదల చేస్తామని ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు.