AP CM Jagan : ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి : సీఎం జగన్

యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

AP CM Jagan : ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి : సీఎం జగన్

AP CM Jagan (1)

AP CM Jagan : ఆదాయన్ని ఆర్జించే శాఖలతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలన్నారు. దీనివల్ల సమర్థత పెరుగుతుందని, పన్నులు చెల్లించేవారికి సౌలభ్యంగా సేవలు అందుతాయని.. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. వీటిని అధ్యయనం చేసి వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు.

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో సీఎం జగన్ కు వివిధ శాఖలకు చెందిన అధికారులు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి సాధించిందని చెప్పారు.

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి సంబంధించి కేంద్రానికి పలు విజ్ఞాపనలు

2022-23లో రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు అని తెలిపార. 93.24శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణల ద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతల పట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పనితీరును మెరుగుపరుచుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. కాబట్టి వీటిపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ధి చెందినట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. గత ఐదేళ్లుగా క్రమంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తోందని చెప్పారు.

CM Jagan : పంట కొనుగోళ్లపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

2018-19లో ఈ శాఖ ఆదాయం రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి ఆదాయం రూ.8071కోట్లకు చేరిందని వివరించారు. రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్‌ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్లకూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలని అధికారులకు సూచించారు.

ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నెంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ ఉంచాలని పేర్కొన్నారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి వాటిని అమల్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అవినీతి నిరోధకశాఖను క్రియాశీలకంగా ఉంచాలని సీఎం ఆదేశించారు.

CM Jagan : రైతులకు మంచి రోజులు.. ధాన్యం సేకరణపై సీఎం జగన్‌ సమీక్ష

2018-19 తో పోలిస్తే 2022-23లో 12.61శాతం లిక్కర్‌ వినియోగం తగ్గినట్టుగా అధికారులు తెలిపారు. 2018-19లో 384.3 లక్షల కేసుల లిక్కర్ ను రాష్ట్రంలో వినియోగిస్తే.. 2022-23లో 335.9 లక్షల కేసుల లిక్కర్‌ వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. 2018-19లో 277.1 లక్షల కేసుల బీరును వినియోగిస్తే.., 2022-23లో 116.7 లక్షల కేసుల బీరు మాత్రమే వినియోగించినట్టు అధికారులు తెలిపారు. 2018-19తో పోలిస్తే 2022-23లో 57.87శాతం తక్కువగా బీరు వినియోగించినట్టు అధికారులు వెల్లడించారు.

డ్రగ్స్, మత్తుపదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. యూనివర్శిటీలు, కాలేజీలు, విద్యాసంస్థల వద్ద కచ్చితంగా టోల్‌ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్ ఉంచాలని సీఎం జగన్ సూచించారు. డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నెంబర్‌ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్‌ చేపట్టాలని సూచించారు. మరోవైపు గనులు ఖనిజాల శాఖలో 2022-23 సంవత్సరంలో రూ.4500 కోట్లు లక్ష్యం కాగా, రూ. 4,756 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.

CM Jagan Target Tekkali : టార్గెట్ టెక్కలి.. అచ్చెన్నాయుడు నియోజకవర్గంపై సీఎం జగన్ సమీక్ష, కచ్చితంగా గెలవాలని ఆదేశం

గత ఏడాదితో పోలిస్తే 26శాతం వృద్ధి ఉందని తెలిపారు. ఈ ఏడాది రూ.6వేల కోట్ల మేర ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. రవాణా శాఖలో 2022-23లో ఆదాయం రూ. 4294.12 కోట్లు ఉందదని, రవాణా శాఖ 95.42శాతం లక్ష్యాన్ని చేరుకుందని పేర్కొన్నారు. 2018-19లో ఈ ఆదాయం రూ. 3224.98 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) లో రూ.6999.42 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. రవాణా శాఖలో మెరుగైన విధానాలు తీసుకురావాలని, దీనిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.