AP Politics: మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయి.. మంత్రి రోజా

అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగింది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరు

AP Politics: మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయి.. మంత్రి రోజా

Roja slams CBN: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఛార్జ్‭షీట్‭ను ఆమె పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబని, ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారంటూ దుమ్మెత్తి పోశారు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా.

Asaduddin Owaisi: దమ్ముంటే చైనా మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చిన ఓవైసీ

బుధవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ‘‘చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరు. అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగింది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది. రైతులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయనను నమ్మి ఓటేసే రైతులు ఎవ్వరూ లేరు’’ అని అన్నారు.

Rajasthan Politics: లోక్‭సభ, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాజస్థాన్‭లో మెగా ప్రచారాన్ని ప్రారంభించున్న ప్రధాని మోదీ