Minister Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని రోజా అన్నారు.

Minister Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Roja

Minister Roja: ఏపీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని రోజా అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్న టీడీపీ, ఇతర పార్టీలకు ఇది చెప్పుదెబ్బ లాంటిదని అన్నారు.

Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు

టీడీపీ హయాంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తేనే చంద్రబాబును ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారని, ప్రస్తుత ప్రభుత్వంలో వరుసగా రెండుసార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ లో ర్యాంకింగ్ రావడం జగనన్నను ఎలా పొగడాలో కొంతమందికి అర్థం కావడం లేదని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మాని హైదరాబాద్ ఇంట్లో కూర్చోవాలని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కేవలం ప్రచార ఆర్భాటంతప్పితే జరిగిన అభివృద్ధి ఏమీలేదని, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని రోజా అన్నారు.

TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ బస్సెక్కితే స్వామివారి దర్శనం టికెట్..

సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- ఈవోడీబీ)లో ఏపీ ప్రభుత్వం ప్రథమ స్థానంలో నిలిచింది. వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయోజనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచి గత ర్యాంకింగ్ ను ఏపీ ప్రభుత్వం కాపాడుకుంది. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారితో పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.