AP Covid List : ఏపీలో కొత్తగా 02 కరోనా కేసులు నమోదు

ఏపీలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,059..(AP Covid List)

AP Covid List : ఏపీలో కొత్తగా 02 కరోనా కేసులు నమోదు

Ap Corona

AP Covid List : ఏపీలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,059 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా ఇద్దరికి మాత్రమే పాజిటివ్ గా తేలింది. గడిచిన 24 గంటల్లో మరో నలుగురు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా మరణాలేవీ సంభవించలేదు. నేటివరకు రాష్ట్రంలో 3,34,82,472 కరోనా పరీక్షలు నిర్వహించారు.

రాష్ట్రంలో నేటివరకు 23,19,616 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,04,845 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 14వేల 730. రాష్ట్రంలో ఇంకా 41 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 1,988 కరోనా పరీక్షలు నిర్వహించారు. రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.(AP Covid List)

Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే

అటు దేశంలోనూ కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 4 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 796 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు కొద్దిగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో 946 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గి, 10 వేలకు దిగొచ్చాయి. యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతంగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఒక్క రోజు వ్యవధిలో మరో 19 మంది కొవిడ్ తో మరణించారు. ఇక నిన్న 15.6 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 185 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. మరోవైపు 18 ఏళ్లు దాటిన వారికి ప్రికాషనరీ డోసు ఇస్తున్న విషయం విదితమే.

ఇది ఇలా ఉంటే.. దేశంలో కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కరోనా నియంత్రణ నిమిత్తం శరవేగంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నా.. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయంపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) చీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా మాట్లాడారు. దేశంలో ఒకటి రెండు చోట్ల బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్.. తీవ్రమైన సంక్రమణకు దారితీయనందున ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆయన అన్నారు.(AP Covid List)

Covid-19 compensation: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం..60 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు : సుప్రీంకోర్టు

ఇతర దేశాల నుంచి వస్తే తప్ప, మన దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా.. అలాంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్-జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్లలో Covid -19 XE వేరియంట్ ఆసియాలో తీవ్ర వ్యాప్తిలో ఉందని.. నిత్యం 14 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు ఆసియా దేశాల్లో నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చైనాలో ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర వ్యాప్తిలో ఉండగా.. మహమ్మారి కట్టడికి చైనాలో కఠిన లాక్ డౌన్ విధించారని WHO తెలిపింది.