AP Covid Cases List : ఏపీలో కొత్తగా 28 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9వేల 394 కరోనా పరీక్షలు..(AP Covid Cases List)

AP Covid Cases List : ఏపీలో కొత్తగా 28 కరోనా కేసులు

Ap Corona

AP Covid Cases List : ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9వేల 394 కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 14 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో చెరో 4 కేసులు వచ్చాయి. నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలలో చెరో 2 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో చెరో ఒక పాజిటివ్ కేసు వెలుగుచూశాయి.

గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు సంభవించలేదు. ఒక్కరోజు వ్యవధిలో మరో 77 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 202 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14వేల 730. నేటివరకు రాష్ట్రంలో 23,19,560 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,04,628 మంది కోలుకున్నారు. నేటివరకు రాష్ట్రంలో 3,34,41,365 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 8,017 కరోనా పరీక్షలు నిర్వహించగా 8 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి.(AP Covid Cases List)

India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. గురువారం 6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,335 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల వ్యవధిలో మరో 1,918 మంది కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో మరో 52 మంది కోవిడ్ తో మరణించారు. ముందురోజు కరోనా మృతుల సంఖ్య 28గా ఉంది.

ఇక యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గి.. 14వేల దిగువకు చేరాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 13,672కి చేరింది. యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.76 శాతానికి చేరుకుంది. నేటివరకు దేశంలో మొత్తంగా 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.21 లక్షల మంది మరణించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకూ 184 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 23.5 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.(AP Covid Cases List)

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.

Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి

దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.