పువ్వులు చల్లిన మహిళపై అశోక్ గజపతి రాజు ఆగ్రహం, పూల దండను నేలకేసి కొట్టారు

ఓ మహిళ అశోక్ గజపతి రాజుపై పువ్వులు చల్లింది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన..ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పువ్వులు చల్లిన మహిళపై అశోక్ గజపతి రాజు ఆగ్రహం, పూల దండను నేలకేసి కొట్టారు

Vizianagaram

Ashok Gajapathi Raju : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశంలో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే..మహిళలను కించపరిచే ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అయితే..విజయనగరంలో జరిగిన ఘటన కలకలం రేపింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సహనం కోల్పోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2021, మార్చి 08వ తేదీ సోమవారం ఉదయం విజయనగరం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఓ మహిళ అశోక్ గజపతి రాజుపై పువ్వులు చల్లింది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన..ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వేయడానికి వచ్చిన పూల దండను నేలకేసి కొట్టడంతో అందరూ అవాక్కయ్యారు. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఇలా ఎందుకు చేశారో అని చర్చించుకుంటున్నారు.

మరోవైపు..ఏపీలో ఉదృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెర పడనుంది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం చేసే లక్ష్యంతో అధికార వైస్సార్‌సీపీ ప్రయత్నాలు చేయగా… మున్సిపల్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో సర్వ శక్తులు ఒడ్డుతోంది టీడీపీ.