GVL Narsimha Rao : వైసీపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ పోరాటం : జీవీఎల్ నర్సింహారావు
రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదన్నారు.
BJP Fight YCP Govt : రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా రూ.10వేల 400కోట్లు ఇచ్చి ఏపీపై తనకు ఉన్న అభిమానాన్ని ప్రధాని మోదీ చాటుకున్నారని బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఎందుకని అడగడం విడ్డురంగా, విచిత్రంగా ఉందన్నారు. ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం అంటే ప్రజా సంక్షేమం కోసమేనని చెప్పారు. అనవసర నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. ఈ మేరకు జీవీఎల్ గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదన్నారు. రాష్ట్ర ప్రజలకు నిధులు ఇస్తే లాభాపేక్ష ఆశించి చేస్తున్నారని నిందలు వేయడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత కంటే ఎక్కువ వచ్చాయని తెలిపారు.
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్ కట్ చేసే పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోతాయని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నెరేగా కింద దేశంలోనే అత్యధికంగా రూ.55వేల కోట్లు తీసుకున్న రెండో రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు.
నిధులు ఇవ్వడం ద్వారా ఏ రాజకీయ పార్టీకో మేలు జరుగుతుందనే అంచనాలతో విమర్శలు చేయడం దుర్మార్గం అన్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయడం లేదనే కథనాలు వండి వారుస్తున్నారని వెల్లడించారు. సీబీఐ చేతకాని సంస్థగా భావిస్తున్నారా….? సీబీఐ నిర్ణయం తీసుకుంటే ఏ స్థాయికి అయినా వెళుతుందన్నారు. రౌడీయిజం చేసి అడ్డుకోవడం సాధ్యం కాదని తెలిపారు.
Manipur : మండిపోతున్న మణిపూర్ .. వంట గ్యాస్ ధర రూ. 1800, లీటరు పెట్రోలు రూ.170
సీబీఐ వంటి సంస్థలను ఏ శక్తి ఆపలేదని తేల్చి చెప్పారు. రాజకీయ వ్యాఖ్యానాలు చేసి అభాసుపాలు కావొద్దన్నారు. తాటాకు చప్పుళ్ళకు భయపడే సంస్థ సీబీఐ కాదని స్పష్టం చేశారు. తోక పార్టీలు చేసే విమర్శలు పట్టించు కోవాల్సిన అవసరం లేదని తెలిపారు.