Botsa Satyanarayana : సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ : బొత్స

కొనసాగుతారా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. శ్రీరాముని కృప వల్ల అంతా మంచే జరుగుతుందన్నారు.

Botsa Satyanarayana : సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ : బొత్స

Botsa Satyanarayana (1)

Botsa Satyanarayana : సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ కొత్త కేబినెట్ కూర్పుపై కసరత్తులు చేస్తున్నారని పేర్కొన్నారు. కొనసాగుతారా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. శ్రీరాముని కృప వల్ల అంతా మంచే జరుగుతుందన్నారు.

ఏపీ కొత్త మంత్రుల జాబితా రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్ కు చేరుకోనుంది. కేబినెట్ పై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. దీంతో ఇప్పటివరకు తెలిసిన పేర్లలో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సందర్భంలో కేబినెట్ పాత మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. మరి కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Governor : ఏపీ మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్ కొలువు తీరడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఏపీ రాజ్ భవన్ కు జీఏడీ అధికారులు చేరుకున్నారు. సీల్డ్ కవర్ లో ఏపీ కొత్త మంత్రుల జాబితా ఉంది. గవర్నర్ స్పెషల్‌ సీఎస్‌కు జీఏడీ అధికారులు సీల్డ్ కవర్ అందించనున్నారు. 25 మంది పేర్లతో కూడిన మంత్రుల జాబితాను ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. సాయంత్రం 5 గంటల లోపు గవర్నర్ కొత్త మంత్రుల జాబితాకు ఆమోదముద్ర వేయబోతున్నారు.

మంత్రివర్గంలో కొనసాగేది ఎవరూ….కొత్తగా వచ్చేది ఎవరో.. 10 టీవీ నిన్ననే ఎక్స్‌క్లూజివ్ రిపోర్టు అందించింది. ఆ రిపోర్టును దాదాపుగా నిజం చేస్తూ జగన్ ఎలక్షన్ టీమ్ 2.0 రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు పది మంత్రి పేర్లు బయటకు వచ్చాయి. వారిలో పాత మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, జయరాం, వేణుగోపాల్ ఉన్నారు.

AP New Ministers : రాజ్ భవన్ కు జీఏడీ అధికారులు.. సీల్డ్ కవర్ లో ఏపీ కొత్త మంత్రుల జాబితా

కొత్తగా జోగి రమేశ్, విడదల రజిని, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్ననాథ్ , కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్లు బయటకు వచ్చాయి.మరికాసేపట్లో మిగతా పేర్లు కూడా బయకు రాబోతున్నాయి. రేపు ప్రమాణస్వీకారం చేయబోయే వారికి సీఎంవో నుంచి ఫోన్లు వెళ్తున్నాయి.