KTR Open Letter : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం 5 వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని గుర్తు చేశారు.

KTR Open Letter : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

KTR

KTR Open Letter : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానండి అని లేఖలో పేర్కొన్నారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందన్నారు.

తన కార్పొరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోదీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రమే ఈ వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలని తెలిపారు.

R.Narayanamurthy : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఉద్యమం ఉధృతం.. సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తి మద్దతు

కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం 5 వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని గుర్తు చేశారు. లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని పేర్కొన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవన్నారు. ఇది ముడి సరుకులకు మూలధనం పేరిట స్టీల్ ప్లాంట్ ని తమ అనుకూల ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రగా అభివర్ణించారు. వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కు… దీని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత అని అన్నారు.

Central Government : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదు : కేంద్రం

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ గారికి కేటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ఆపేందుకు లక్షలాది పీఎస్ యూ కార్మికులు బీఆర్ఎస్ తో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.