Accident: అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు బోల్తా పడిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి..

Accident: అనంతపురం జిల్లాలో బస్సు బోల్తా.. ముగ్గురు మృతి

Accident

Accident: ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు బోల్తా పడిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 22 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

తిరుమలకు వెళ్లి తిరిగి పులగంపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. కాగా మినీ బస్సులో మొత్తం 32 మంది కుటుంబసభ్యులు ప్రయాణిస్తుండగా వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.. వారి బంధువులుగా తెలుస్తుంది. చలపతి (45) బాదమ్మ (40) బార్యాభర్తలు మేనల్లుడు ఈశ్వరయ్య (22) ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందగా మరో 15 మందికీ తీవ్రగాయాలైయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను కదిరి ఆసుపత్రికి తరలించారు.

బాధితులందా పులగంపల్లికి చెందినవారని తెలిపిన స్థానికులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరో పది నిమిషాల్లో సొంతూరుకు చేరుకుంటామనగా ప్రమాదం జరగడంతో గ్రామంలో విషాదం నెలకొన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.