AP Govt: ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు కింద కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది మరో రూ.1.438.08 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే..

AP Govt: ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ నిధుల విడుదల

Ap Govt

AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు కింద కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది మరో రూ.1.438.08 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే ఆరుసార్లు చెల్లించిన కేంద్రం ఇప్పుడు తాజాగా ఏడో వాయిదా చెల్లించింది. ఏపీ సహా 17 రాష్ట్రాలకు ఏడో వాయిదా కింద సోమవారం రూ.9,871 కోట్లు విడుదల చేయగా.. ఇందులో ఏపీకి రూ.1,438.08 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దీంతో గతంలో చెల్లించిన నిధులతో పాటు.. ఇప్పుడు చేసిన నిధులను కలిపి ఇప్పటి వరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ.10,066.58 కోట్లను గ్రాంటుగా విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు లోబడి.. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాలన్నిటికీ మొత్తంగా రూ.69,097 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ 17 రాష్ట్రాలకు మొత్తం రూ.1,18,452 కోట్లు ఇవ్వాల్సి ఉంది.

రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాల లోటు భర్తీకి కేంద్రం నిధులు విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు కేంద్రం మరోసారి ఈ పెండింగ్ నిధులను చెల్లించింది. ఒకవిధంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం నుంచి ఇది శుభవార్త అని చెప్పాలి. అయితే.. ఇదేమీ భారీ నిధులు కాకపోయినా ఏపీకి స్వల్ప ఊరట కలిగించనుంది.