Chandrababu Naidu : నా ప్రాణం అడ్డుపెట్టి మైనారిటీలను కాపాడతా, సబ్‌ప్లాన్ అమలు చేస్తా-చంద్రబాబు

Chandrababu Naidu : ముస్లింలకు ఇవ్వాల్సిన పథకాలకు తిలోదకాలు ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు బతుకుతున్నారు.

Chandrababu Naidu : నా ప్రాణం అడ్డుపెట్టి మైనారిటీలను కాపాడతా, సబ్‌ప్లాన్ అమలు చేస్తా-చంద్రబాబు

Chandrababu Naidu (Photo : Google)

Chandrababu Naidu : పేదల కోసం ప్రత్యేక పథకం అమలు చేస్తానని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పేద ప్రజలను ఆదుకోవడానికి తాను కృషి చేస్తానన్నారు. అందుకోసం ఓ పథకం తెస్తానన్నారు. రాబోయే రోజుల్లో ఆ పథకానికి శ్రీకారం చుడుతున్నా అని చంద్రబాబు చెప్పారు.

టీడీపీ నేత సుభానీ అకాల మరణానికి చంద్రబాబు సంతాపం తెలిపారు. సుభానీ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి మసీదుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, కరెంట్ బిల్లులో సబ్సిడీ ఇవ్వాలనే విషయాన్ని తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని హామీ నెరవేరుస్తాను అని చంద్రబాబు అన్నారు. మైనారిటీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

జగన్ మోహన్ రెడ్డి పార్టీ మైనారిటీలను మోసం చేసిన పార్టీ చంద్రబాబు ధ్వజమెత్తారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన ఘనత టీడీపీ పార్టీది అన్నారు. దుల్హన్ పథకం అమలు చేసిన పార్టీ టీడీపీ అన్నారు. అయితే, నిబంధనలు పెట్టి నేడు దుల్హన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. రంజాన్ తోఫా ఇచ్చి పేద ముస్లింల ఇంట వెలుగులు నింపామన్నారు చంద్రబాబు. ముస్లింలకు ఇవ్వాల్సిన పథకాలకు తిలోదకాలు ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ అని విరుచుకుపడ్డారు.(Chandrababu Naidu)

Also Read..AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే ఆ పేపర్ కు వెయ్యి కోట్లు యాడ్స్ ఇచ్చారని ఆరోపించారు. గతంలో మసీదులు, ఈద్గాలు, మౌలానాలకు జీతాలు ఇచ్చామన్నారు. నేటి ప్రభుత్వ హయాంలో మీటింగ్ పెట్టాలంటే వారి పర్మిషన్ తీసుకోవాలా? అని ఫైర్ అయ్యారు. మైనారిటీ సోదరులపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, చూస్తూ ఊరుకోము అని చంద్రబాబు హెచ్చరించారు. నా ప్రాణం అడ్డుపెట్టి మైనారిటీలను కాపాడతానని చంద్రబాబు అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ పోలీసులతో కేసులు పెట్టించి పరిపాలన చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఏపీలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు బతుకుతున్నారని చంద్రబాబు అన్నారు. ఎంపీ అవినాశ్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇంకా నిర్దోషిని అని అనడం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబు. చివరికి కన్న కూతురు సునీతా రెడ్డి హత్య చేసినట్లు కేసులు పెట్టిన నీచమైన వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు. మైనారిటీ యువతులు, మహిళలు, బాలికలు వైసీపీ నేతల చేతుల్లో బలైపోయారని చంద్రబాబు ఆరోపించారు. ఇన్ని రకాలుగా హత్యలు, మానభంగాలు చేస్తున్నా చోద్యం చూస్తూ కూర్చున్నారని విమర్శించారు.

నంద్యాలలో మైనారిటీ కుటుంబసభ్యులు నలుగురు మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. అంగన్ వాడీ వర్కర్ ఒంటరి మహిళను ఇబ్బందులు పెట్టి రాజద్రోహం కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గురజాల, మాచర్లలో వంద కుటుంబాలు రక్షణ లేక గ్రామం వదలి వెళ్లిపోయారని చంద్రబాబు తెలిపారు. ఇసుక దందాపై పోరాటం చేస్తున్న కొమ్మలపాటిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని చంద్రబాబు నిలదీశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మతకలహాలు లేకుండా చేసిన ఘనత టీడీపీదే అన్నారు చంద్రబాబు.(Chandrababu Naidu)

Also Read..Tuni Constituency: టీడీపీ కొత్త ఎత్తులు.. జనసేనను నడిపించే నాయకుడు ఎవరు.. తునిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా?

ఆటోనగర్లు పెంచుతామని, అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీలపై దాడులు చేసిన వారిపై ప్రత్యేక చట్టం తెస్తానని, కఠిన చర్యలు ఉండే విధంగా చూస్తానని చంద్రబాబు చెప్పారు. టీడీపీ హయాంలో టెక్నాలజీ అభివృద్ధి చేశానని, దేశానికి ఆదర్శంగా ఉన్నామని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో మైనారిటీలను రాజకీయంగా అభివృద్ధి చేశామన్నారు. ముస్లింలకి 4శాతం రిజర్వేషన్లు కావాలని పోరాటం చేశామన్నారు. ముస్లింలకు తప్పకుండా రక్షణ కల్పించే బాధ్యత నాది అని, ముస్లింలకు సబ్ ప్లాన్ అమలు చేసే బాధ్యత నాది అని చంద్రబాబు హామీ ఇచ్చారు.