Chandrababu Warning : రేపు..నీ పేపర్, టీవీ, సిమెంట్కు నేనే పర్మిషన్ ఇవ్వాలి- చంద్రబాబు ఫైరింగ్ స్పీచ్
ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడేదే లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెడితే.. వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలని గుర్తుంచుకోండి.
Chandrababu Warning : మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరింగ్ స్పీచ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైసీపీ నేతలను హెచ్చరించారు చంద్రబాబు.
Chandrababu Fires On Jagan : ఏ మహానాడులోనూ ఇంత కసి చూడలేదు, జగన్కు నిద్ర పట్టదు-చంద్రబాబు
ఛార్జీలన్నీ పెంచేశారు. వీరబాదుడు బాదేస్తున్నారు. ప్రజలు అడగలేరనే ధైర్యమా? ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేశారు. ప్రజల తరపున మేం పోరాడుతోంటే.. మా పై నీచంగా మాట్లాడుతున్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. మేం భయపడేదే లేదు. బుల్లెట్ లా దూసుకెళ్తాం. మమ్మల్ని ఇబ్బందులు పెడితే.. వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలి గుర్తుంచుకోండి. రౌడీలను, గూండాలను వదిలి పెట్టేదే లేదు. వైసీపీ ప్రభుత్వం మోసకారి సంక్షేమం అమలు చేస్తోంది. చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పులు ఇవ్వడం లేదు.
Nandamuri Balakrishna: టీడీపీతోనే భవిష్యత్తు: నందమూరి బాలకృష్ణ
మహానాడుకు వచ్చిన ప్రజా వెల్లువ చూసారా! ఈ జన సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవడం తధ్యం.#Mahanadu2022 pic.twitter.com/IPoKn1yO4p
— Telugu Desam Party (@JaiTDP) May 28, 2022
అఖండ సినిమాను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రజలపై నమ్మకం ఉంచి బాలకృష్ణ తన సినిమాను విడుదల చేశారు. సక్సెస్ అయింది. అదీ బాలయ్య అంటే. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా..? సినిమా విడుదల చేయాలంటే మీ పర్మిషన్ కావాలా..? రేపు నీ పేపర్ కు నేనే పర్మిషన్ ఇవ్వాలి. రేపు నీ టీవీ ఎలా నడుపుతావ్, భారతీ సిమెంట్స్ ఎలా నడుపుతావ్? కొన్ని విలువలతో రాజకీయం చేస్తే శాశ్వతంగా ఉంటుంది. తప్పుడు రాజకీయాలు చేస్తే శాశ్వతం కాదు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్