Chandra Babu Naidu : అధికారంలోకి రావటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న చంద్రబాబు

Chandra Babu Naidu : అధికారంలోకి రావటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న చంద్రబాబు

Chandrababu Viktary (1)

Chandra babu coming : పార్టీ నేతల వల్ల కావట్లేదు. సీనియర్లు బయటకు రావడం లేదు. కింది స్థాయి లీడర్లకు నమ్మకం రావడం లేదు. అందుకే.. వాళ్లూ.. వీళ్లూ కాదు.. ఆయనే రంగంలోకి దిగుతున్నారు. గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. తెలుగు రాష్ట్రమైన ఏపీలో.. మళ్లీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చేందుకు.. చంద్రబాబే జనంలోకి వస్తున్నారు. ఇప్పటి నుంచి.. ఎన్నికల దాకా ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంటారు. జనంతో కలిసిపోతారు.

ఎంత చెప్పినా.. ఎన్నిసార్లు దిశానిర్దేశం చేసినా.. ఎవరి వల్లా కావట్లేదు. అందుకే.. పసుపు దళపతి.. టీడీపీ అధిపతి.. చంద్రబాబే.. రంగంలోకి దిగుతున్నారు. పడిపోయిన టీడీపీని మళ్లీ నిలబెట్టేందుకు బాబే వస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచే.. చంద్రబాబు టూర్ మొదలు కాబోతోంది. ఎందుకంటే.. ఆయనకు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ నిండుగా ఉంది. టీడీపీ స్థాపన నుంచి ఇక్కడి జిల్లాలన్నీ తెలుగుదేశం వైపే నిలబడ్డాయి. రాష్ట్రం మొత్తంలో పరిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీ పరువు నిలిపేది ఉత్తరాంధ్రే అన్న టాక్ కూడా ఉంది. అలాంటిది.. 2019 ఎన్నికల్లో.. సగం ఫ్యాన్ నీడకు చేరిపోతే.. అరడజన్ సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయ్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే.. ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేకపోయింది. అందువల్ల.. ఉత్తరాంధ్ర జిల్లాలో ఈసారి కూడా ఓడితే.. అధికారంలోకి రావడం కష్టమేనన్న ఆలోచనలో పడింది తెలుగుదేశం నాయకత్వం. అందుకోసం.. ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలు, ఐదు ఎంపీ సీట్లలో.. మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంపైనే ఫోకస్ పెట్టారు చంద్రబాబు.

ఉత్తరాంధ్ర నుంచే జిల్లాల టూర్లకు శ్రీకారం చుట్టబోతున్నారు బాబు. శ్రీకాకుళం జిల్లా నుంచే అది మొదలుకాబోతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పన్నులు, విద్యుత్ చార్జీల బాదుడుకు వ్యతిరేకంగా.. బాదుడే బాదుడు పేరిట సాగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు బాబు. ఇదెక్కడో కాదు.. స్పీకర్ తమ్మినేని సొంత ఇలాకా అయిన ఆముదాలవలస పొందూరు మండలంలో జరిగే నిరసన కార్యక్రమంలో బాబు ల్యాండ్ అవుతారు. దీంతో.. పార్టీ కేడర్‌లోనూ జోష్ వస్తుందని.. తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయ్.

ఇదంతా కాదు.. చంద్రబాబు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టి ఏడాది దాటింది. గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు.. విశాఖ వచ్చిన బాబు.. మళ్లీ ఇన్నాళ్లకు అక్కడ అడుగు పెట్టనున్నారు. అధినేతకు స్వాగతం పలికేందుకు.. కేడర్ కూడా రెడీ అయింది. ఈసారి ఎలాగైనా.. ఉత్తరాంధ్రపై పట్టు సాధిస్తామని.. తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి.. చాలా రోజుల తర్వాత జనంలోకి వస్తున్న చంద్రబాబు.. శ్రీకాకుళం నుంచి తమ్మినేనికి, జగన్ సర్కారుకి.. ఎలాంటి సిగ్నల్ పంపుతారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.