Jal Jeevan Mission : సూర్య కిరణాలతో దాహానికి చెక్.. దట్టమైన అటవీప్రాంతంలో సురక్షిత తాగునీరు

అదో దట్టమైన అటవీ ప్రాంతం. దానికి సమీపంలో గ్రామం ఉంది. అక్కడ కరెంట్ లేదు. సరికదా.. రోడ్డు కూడా లేదు. అలాంటి మారుమూల ప్రాంతంలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రోడ్డు లేకపోయినా, విద్యుత్ లేకపోయినా వారి దాహం మాత్రం తీరింది.

Jal Jeevan Mission : సూర్య కిరణాలతో దాహానికి చెక్.. దట్టమైన అటవీప్రాంతంలో సురక్షిత తాగునీరు

Jal Jeevan Mission

Jal Jeevan Mission : అదో దట్టమైన అటవీ ప్రాంతం. దానికి సమీపంలో గ్రామం ఉంది. అక్కడ కరెంట్ లేదు. సరికదా.. రోడ్డు కూడా లేదు. అలాంటి మారుమూల ప్రాంతంలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రోడ్డు లేకపోయినా, విద్యుత్ లేకపోయినా వారి దాహం మాత్రం తీరింది. సురక్షిత తాగునీరు వారికి అందుబాటులో ఉంది. ఇదంతా..
జల్ జీవన్‌ మిషన్‌ వల్లే జరిగింది.

జల్ జీవన్ విజయానికి పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని కాకిన్నూర్‌ గ్రామం ఒక నిదర్శనమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కాకిన్నూర్‌.. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య ఉంది. ఈ గ్రామానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. విద్యుత్‌ సరఫరా లేదు. గ్రామానికి వెళ్లడం చాలా కష్టమైన పని. అలాంటి చోట.. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీరు అందించాలన్న లక్ష్యంతో అధికారులు విజయం సాధించారు.

గోదావరి నదీ తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ గ్రామానికి చేరుకోవడానికి మార్గం లేకపోవడంతో అధికారులు పడవలో డ్రిల్లింగ్‌ యంత్రాలను రవాణా చేశారు. తీరానికి సమీపంలో ఒక వాగు దగ్గరలో గొట్టపు బావిని తవ్వారు. దానికి సౌరశక్తితో పనిచేసే పంపును అమర్చి గ్రామంలో మొత్తం 200 కుటుంబాలకు కుళాయిల ద్వారా సురక్షిత తాగునీటిని అందించగలిగారు.

ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యం కాకిన్నూర్‌ గ్రామంలో పూర్తిగా నెరవేరింది. కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీటిని తాగడంతో ప్రజల ఆరోగ్య స్థితిగతులు పూర్తిగా మెరుగుపడ్డాయి’ అని మంత్రిత్వ శాఖ ప్రశంసలు కురిపించింది. దేశంలో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లోని ఏడు కోట్ల గృహాలకు జల్‌జీవన్‌ మిషన్‌ కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపింది.