Volunteers : గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ మరో శుభవార్త

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం జగన్ సోమవారం(ఏప్రిల్ 12,2021) ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు.

Volunteers : గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ మరో శుభవార్త

Volunteers

Volunteers : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో గ్రామ, వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం ‘వాలంటీర్లకు వందనం’ సీఎం జగన్ సోమవారం(ఏప్రిల్ 12,2021) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 9మంది వాలంటీర్లను సత్కరించి, సేవా పురస్కారాలు అందజేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు సీఎం జగన్. అనంతరం ఆన్ లైన్ లో వాలంటీర్లకు నగదు ప్రోత్సాహకాలు అందించారు.

cm jagan

ఇక ప్రతి ఏటా సత్కారం:
ఈ సందర్భంగా వాలంటీర్లపై సీఎం జగన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాలంటీర్లు పని చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. వారి వల్లే సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయని చెప్పారు. కులాలు, మతాలు అనేది చూడకుండా వివక్ష లేకుండా వాలంటీర్లు పని చేస్తున్నారని సీఎం జగన్ కితాబిచ్చారు. రూపాయి లంచం లేకుండా పింఛన్ అందిస్తున్న గొప్ప సైనికులని వాలంటీర్లను పొగిడారు. వాలంటీర్లు విమర్శలకు బెదరకూడదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం జగన్ వాలంటీర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ప్రతి ఏటా వాలంటీర్లకు సత్కారం చేస్తామని ప్రకటించారు.

volunteers

97శాతం మంది యువకులే:
రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 60 వేల మంది వాలంటీర్లు 97 శాతం మంది యువకులే ఉండటం గర్వకారణని.. ఇందులో 50శాతం మంది మహిళలే ఉండటం సంతోషంగా ఉందన్నారు జగన్. వీరంతా పేదలు బాధలు అర్ధం చేసుకున్నవారేనని, వివక్షకు తావులేకుండా ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని సీఎం జగన్ ప్రశంసించారు. వ్యవస్థను చక్కగా అమలు చేస్తున్న వారంతా నా వాలంటీర్లేనని గర్వంగా చెప్తున్నా అని అన్నారు.

cm jagan volunteers

సత్కారంతో పాటు నగదు పురస్కారం:
రాష్ట్ర వ్యాప్తంగా సేవా మిత్ర అవార్డు కింద 2,18,115 మందిని సత్కరిస్తున్నామని సీఎం చెప్పారు. ఈ కేటగిరీలో ప్రతి వాలంటీర్ కు రూ.10వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా బ్యాడ్జి అందిస్తున్నామన్నారు. సేవారత్న అవార్డు కింద 4వేల మంది వాలంటీర్లకు రూ.20వేలు నగదు, పతకం, శాలువా, బ్యాడ్జీ అందజేస్తున్నట్లు తెలిపారు. మూడో కేటగిరీ సేవా వజ్ర అవార్డు కింద 875 మందికి రూ.30వేల నగదు సర్టిఫికెట్, శాలువాతో పాటు బ్యాడ్జి ఇస్తున్నామన్నారు.